Adah Sharma: సుశాంత్ ఇంట్లోకి షిఫ్ట్ అయిన అదాశర్మ !

ఇంటిని రీమోడలింగ్ చేయించుకుంది అదా శర్మ . రీసెంట్ గా తన ఫ్యామిలీతో సుశాంత్ ఇంటికి షిప్ట్ అయ్యింది అదా.


Published Oct 19, 2024 09:40:00 PM
postImages/2024-10-19/1729354228_samayamtelugu112460093.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఇంటిని నటి అదా శర్మ కొనుకున్నారు. ఈ సంగతి జరిగి చాలా నెలలు కూడా అయ్యింది. అయితే ఇంటిని రీమోడలింగ్ చేయించుకుంది అదా శర్మ . రీసెంట్ గా తన ఫ్యామిలీతో సుశాంత్ ఇంటికి షిప్ట్ అయ్యింది అదా.ఆమె పబ్లిసిటీ కోసమే ఇలా చేస్తున్నారని కొందరు ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా వీటిపై అదా స్పందించారు. ఒక నటిగా తనకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని ఇలాంటివాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. నేను ఇంటిని కొనుకున్నాను.నాకు పబ్లిసిటీ ఇలా అవసరం లేదు..నా సినిమాల వల్ల నాకుఫేమ్ కావాలి అంటూ చెప్పుకొచ్చింది.


తాను ఆ ఇంటిని కొనుగోలు చేయడంపై ఎవరి అభిప్రాయాలు వాళ్లు తెలిపారనీ తనకు చేయాలనిపించింది తాను చేశాననీ అదా శర్మ కామెంట్‌ చేసింది. సుశాంత్‌ ఇల్లు ఎంతో నచ్చిందనీ తన అమ్మ, అమ్మమ్మతో కలిసి ఇక్కడ ఉంటున్నట్లు చెప్పుకొచ్చింది. తనకు ఆ ఇంట్లో చాలా పాజిటివ్ ఎనర్జీ ఉందని తెలిపారు. మొత్తం రీమోడలింగ్ చేసి మొదటి అంతస్తుని గుడిలా మార్చేసినట్లు చెప్పింది. ఒక గదిని మ్యూజిక్‌ రూమ్‌గా, మరో దాన్ని డ్యాన్స్‌ స్టూడియోగా చేసిందట. టెర్రస్‌ మొత్తం గార్డెన్‌లా మార్చేసినట్లు తెలిపింది. తనకు చాలా నచ్చిన కొనుక్కున్న ఇళ్లు ..చాలా హ్యాపీ గా ఆ ఇంట్లో ఉంటానని తెలిపారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu home adah-sharma sushanth-singh-rajputh

Related Articles