odissa: ఈ రోజుల్లో నరబలా...ఒడిస్సా దారుణం !

బాలుడి మృతదేహాన్ని కనిపెట్టారు. పౌర్ణమి రోజు తప్పిపోయిన పిల్లలు తప్పక నరబలి చేస్తారని వాపోయారు బాలుడు


Published Oct 19, 2024 11:33:20 AM
postImages/2024-10-19/1729355521_44825222716052thumbnail16x9humansacrifice.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  బ్లాక్ మ్యాజిక్ ..సిల్లంగి ..నరబలి లాంటివి వినే చాలా యేళ్లు అయ్యింది. ఇప్పుడు ఇలాంటి మాటలు విన్నా కాని చేస్తున్నారని చేశారని తెలియడమే చాలా రేర్ . ఒడిశా బలంగీర్ జిల్లాలో 13 ఏళ్ల బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. బాలుడిని అడవిలోకి తీసుకెళ్లి హత్యచేసి వదిలేశారు గుర్తుతెలియని దుండగులు. అయితే గ్రామస్థులంతా ఇది పౌర్ణమి రోజు జరిగిన నరబలిగా చెప్పడంతో పోలీసులు ఆశ్చర్యపోతున్నారు.


లాథోర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జలియాలిటి గ్రామ సమీపంలో ఉన్న అడవిలో 13 ఏళ్ల బాలుడి మృతదేహాన్ని పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. మృతుడిని సోమనాథ్ బివార్‌గా గుర్తించారు. గురువారం నుంచి సోమనాథ్ కనిపించకపోవడం వల్ల, అతడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


 దీంతో పోలీసులు ముమ్మరంగా గాలించి బాలుడి మృతదేహాన్ని కనిపెట్టారు. పౌర్ణమి రోజు తప్పిపోయిన పిల్లలు తప్పక నరబలి చేస్తారని వాపోయారు బాలుడు తండ్రి.మృతదేహాన్ని పాతిపెట్టేందుకు ప్రయత్నించారని, కానీ ఎందుకో బయటే వదిలేశారని చెప్పుకొచ్చారు. మరోవైపు, సోమనాథ్ కోసం తాము రాత్రంతా నిద్రపోకుండా వెతికామని, కానీ అతడి ఆచూకీ దొరకలేదని గ్రామస్థుడు నారాయణ్ హన్స్ వెల్లడించారు. 
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu died black-magic minor-boy murder

Related Articles