Ramcharan: రామ్ చరణ్ తో పాటు రైమ్ కి అరుదైన గౌరవం..!

డిసెంబర్ 20 వ తేదీ విడుదల కానున్నట్లు మ్యూజిక్ డైరక్టర్ ఎస్ ఎస్ తమన్ తెలియజేశారు. కానీ ఇప్పటి వరకు ఈ సినిమా రిలీజ్ పై ఫుల్ క్లారిటీ లేదు


Published Oct 19, 2024 12:39:00 PM
postImages/2024-10-19/1729321840_ramcharanpetdog1.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: చిరుత సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయిన చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. త్వరలోనే గేమ్ ఛేంజర్ తో మరో సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. డిసెంబర్ 20 వ తేదీ విడుదల కానున్నట్లు మ్యూజిక్ డైరక్టర్ ఎస్ ఎస్ తమన్ తెలియజేశారు. కానీ ఇప్పటి వరకు ఈ సినిమా రిలీజ్ పై ఫుల్ క్లారిటీ లేదు. సంక్రాంతి రిలీజ్ అని ఒకరు...డిసంబర్ రిలజీ్ అని మరొకరు తలొక మాట మాట్లాడుతున్నారు.


అయితే రీసెంట్ గా తెలుగు హీరోల్లో కొంతమంది మైనపు విగ్రహాలను మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రభాస్ మహేష్ బాబు అల్లు అర్జున్ విగ్రహాలను దుబాయ్ లండన్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు రామ్ చరణ్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు.అబుదాబిలో జరిగిన ఐఫా అవార్డు వేడుకలలో భాగంగా మేడం టుస్సాడ్స్ మ్యూజియం వారు మైనపు విగ్రహాలను ఏర్పాటు చేయడం గురించి పలు విషయాలను వెల్లడించారు. రామ్ చరణ్ తో పాటు తన పెట్ రైమ్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు.


రామ్ చరణ్ అలాగే రైమ్ కొలతలను కూడా తీసుకున్నట్లు వెల్లడించారు. చరణ్ తో పాటు రైమ్ గాడికి కూాడా ఈ అరుదైన ఘనత సాధించడంపై పలువురు నెటిజన్లు ఖుషీ అవుతున్నారు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu ramcharan

Related Articles