KTR: మిత్తితో సహా రైతులందరికీ రుణమాఫీ చేయాల్సిందే

రైతుల మిత్తితో సహా ఎలాంటి కొర్రీలు, ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాల్సిందే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


Published Aug 22, 2024 02:35:15 PM
postImages/2024-08-22/1724317515_green.PNG

న్యూస్ లైన్ డెస్క్: రైతుల మిత్తితో సహా ఎలాంటి కొర్రీలు, ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాల్సిందే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం చేవెళ్ల రైతు నిరసన దీక్ష కార్యక్రమంలో పాల్గొని, ఆయన మాట్లాడారు. కేసీఆర్ పోయినంక మా షాబాద్‌కు, చేవెళ్లకు కల పోయిందని ఓ పెళ్లికి వెళితే రవీందర్ రెడ్డి అనే తమ్ముడు చెప్పాడు అని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మా బతుకులు ఆగమైనయ్ అని రవీందర్ రెడ్డి మాదిరిగానే రాష్ట్రంలోని ప్రతి రైతు అనుకుంటున్నారని తెలిపారు.

డిసెంబర్ 9 నాడే మొదటి సంతకం రూ. 2 లక్షలు రుణం ఎత్తేస్తా సోనియా గాంధీ మీద ఒట్టేసి రేవంత్ రెడ్డి చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. సచివాలయంలో లంకె బిందెలు ఉంటాయనుకున్నా కానీ అవి లేనే లేవు.. ఎట్ల రుణమాఫీ చేయలే అన్నట్లుగా రేవంత్ మాట మార్చాడని విమర్శించారు. కొత్తగా వచ్చాడు కదా ఆయనకు కొంత టైమ్ ఇద్దామని మేము కూడా ఎదురుచూశామని అన్నారు. ఇదే రేవంత్ రెడ్డి బ్యాంకర్లతో సమావేశం పెట్టాడు.. 2 లక్షల రుణం మాఫీ కోసం రూ. 49 వేల కోట్లు కావాలని బ్యాంకర్లు చెప్పారు. దీంతో తప్పించుకునేందుకు చావు తెలివితేటలు స్టార్ట్ చేయటం మొదలుపెట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క ఏడాది కడుపు కట్టుకుంటే రూ. 40 వేల కోట్లు కట్టేస్తా అని 9 వేల కోట్లు కట్ చేసి మీడియా ముందు మాట్లాడాడని గుర్తు చేశారు.

పార్లమెంట్ ఎన్నికల నాటికి ఇక ప్రజలు తనను నమ్మరని భావించి.. ఎక్కడికి పోతే అక్కడ దేవుళ్ల మీద ఒట్టేసి ఆగస్ట్ 15కు రుణమాఫీ చేస్తా అని రేవంత్ రెడ్డి చెప్పాడు. ఆగస్ట్ 15 పోయింది.. రుణమాఫీ కాలేదు.. దేవుళ్లను కూడా ఈ రేవంత్ రెడ్డి మోసం చేశాడని కేటీఆర్ ధ్వజమెత్తారు. మొత్తం రైతులందరికీ రుణమాఫీ అయ్యే వరకు బీఆర్‌ఎస్ పోరాటం ఆపేది లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. 

newsline-whatsapp-channel
Tags : telangana mla brs congress ktr farmers cm-revanth-reddy runamafi

Related Articles