Vivek: చెన్నూరు ఎమ్మెల్యేను నిలదీసిన ప్రజలు

తమ గ్రామ సమస్యలను ఎవరూ పట్టించుకోవడంలేదని అన్నారు. ఓట్లు అడగడానికి వచ్చిన నేతలు ఇప్పుడు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.


Published Sep 06, 2024 04:26:14 PM
postImages/2024-09-06/1725620174_vivekcherrunumla.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఈ మధ్య చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ఎక్కిడికి వెళ్తే అక్కడ ప్రజలు ఎదురు తిరుగుతున్నారు. ఇటీవల మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కొల్లూరు గ్రామానికి  వెళ్తున్న సమయంలో రోడ్డుపై మహిళలు నిలదీసి గ్రామంలో డ్రైనేజీలు, రోడ్లు సరిగా లేవని ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగి వారం రోజులు అయిందో లేదో అప్పుడే సుద్దాల గ్రామానికి చెందిన ప్రజలు వివేక్‌ను నిలదీశారు. 

తమ గ్రామ సమస్యలను ఎవరూ పట్టించుకోవడంలేదని అన్నారు. ఓట్లు అడగడానికి వచ్చిన నేతలు ఇప్పుడు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. గ్రామంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ ప్రజా ప్రతినిధులు, అధికారులు ఎవరూ తమ గోడు పట్టించుకోవడంలేదని అన్నారు. 

newsline-whatsapp-channel
Tags : telangana ts-news news-line newslinetelugu congress telanganam vivek-venkataswamy chennuru-mla

Related Articles