ఈనెల 10న ఉదయం 11 గంటలకు కాలేజీ కౌన్సిలింగ్ జరుగుతుంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : రంగారెడ్డి - హైదరాబాద్ రీజియన్ గిరిజన్ గురుకుల కశాలలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. వికారాబాద్ జిల్లాలో 2025-26 విద్యాసంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల, కొడంగల్ లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ఎంపీసీ, బైపీసీ గ్రూపులలో అడ్మిషన్స్ జరుగుతున్నాయని వెల్లడించారు. 2024-25 విద్యా సంవత్సరం పదో తరగతిలో ఉత్తీర్ణులైన గిరిజన బాలురకు ఈనెల 10న ఉదయం 11 గంటలకు కాలేజీ కౌన్సిలింగ్ జరుగుతుంది.
మీరు కాని గురుకుల కాలేజీ జాయిన్ అవ్వాలనుకుంటే కౌన్సిలింగ్కు వచ్చే విద్యార్థులు టీవీ, పదో తరగతి మార్కుల మెమో, స్టడీ, కండక్ట్ సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రాలు పంట తీసుకురావాల్సి ఉంటుందన్నారు. అదే గ్రామాణానికి చెందిన వారు అయితే రూ.1.5 లక్షలు పట్టణ ప్రాంతానికి చెందిన వారికి రూ. 2 లక్షల కు మించరాదని సూచించారు.
అదేవిధంగా ఆధార్ జిరాక్స్, స్పోర్ట్స్, ఆర్ఫన్, PHC ధృవీకరణ పత్రాలు, కలర్ ఫోటోలు, రెండు జతల జిరాక్స్ కాపీలుతో హాజరు కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎంపీసీ, బైపీసీ గ్రూపులలో ఖాళీగా ఉన్న సీట్లలో ప్రవేశం పొందాలనుకున్న బాలురు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, గిరిజన విద్యార్థి అభ్యర్థులను మాత్రమే తీసుకొనున్నట్లు తెలిపారు. మరింత సమాచారం కోసం 8333925370 నంబర్లో సంప్రదించాలన్నారు.