భారత్ 'జీరో టాలరెన్స్' విధానాన్ని అనుసరిస్తోంది. చెడు చేసేవారిని, ఆ చెడు వల్ల నష్టపోయిన బాధితులను ఒకేలా చూస్తామంటే మేం దాన్ని ఎప్పటికీ అంగీకరించం.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్ . జైశంకర్ పాకిస్థాన్ పై మరో సారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉగ్రవాదాన్ని భారత్ ఎప్పటికి సహించదు. పాకిస్థాన్ ను ..బాధిత దేశమైన భారత్ ను ఒకేలా చూస్తే అసలు ఊరుకోదని అన్నారు. బ్రిటన్ విదేశాంగ శాఖ మంత్రి డేవిడ్ లామీతో ఢిల్లీలో సమావేశమైంది. ఈ సమావేశం సంధర్భంగా జైశంకర్ పాకిస్థాన్ పై ఈ వ్యాఖ్యలు చేశారు . పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిని బ్రిటన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించినందుకు జైశంకర్ ధన్యవాదాలు తెలిపారు.
భారత్ 'జీరో టాలరెన్స్' విధానాన్ని అనుసరిస్తోంది. చెడు చేసేవారిని, ఆ చెడు వల్ల నష్టపోయిన బాధితులను ఒకేలా చూస్తామంటే మేం దాన్ని ఎప్పటికీ అంగీకరించం. ఈ విషయం మా భాగస్వామ్య దేశాలన్నీ అర్ధం చేసుకుంటే మంచిదని కోరుకుంటున్నామని తెలిపారు.
ఈ భేటీలో భారత్-బ్రిటన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యపరమైన అంశాలపై ఫలవంతమైన చర్చలు జరిగాయని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై నేతలు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.