Harish rao: కాంగ్రెస్ పాలనలో విద్యా వ్యవస్థ ధ్వంసం

విద్యాశాఖ పట్ల రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధికి, ప్రాధాన్యతకు ఇది మరో నిదర్శనమని ఆయన విమర్శించారు. 9 నెలల కాంగ్రెస్ పాలనలో టీచర్లు లేక పాఠశాలలు మూసేస్తున్నారని ఆయన అన్నారు. పురుగుల అన్నం, గొడ్డుకారం తినలేక విద్యార్థులు ఏడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


Published Sep 05, 2024 07:23:45 PM
postImages/2024-09-05/1725544425_harishraofiresonrevanthreddy.jpg

న్యూస్ లైన్ డెస్క్: కాంగ్రెస్ తొమ్మిది నెలల పాలనలో విద్యా వ్యవస్థ ధ్వంసమైందని మాజీ మంత్రి, సిద్ధిపేట BRS ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారికంగా నిర్వహించిన గురుపూజోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకాకపోవడంపై స్పందిస్తూ ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అధికారికంగా నిర్వహించిన గురుపూజోత్సవానికి హాజరయ్యే తీరిక లేదా అని ఆయన ప్రశ్నించారు. 

విద్యాశాఖ పట్ల రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధికి, ప్రాధాన్యతకు ఇది మరో నిదర్శనమని ఆయన విమర్శించారు. 9 నెలల కాంగ్రెస్ పాలనలో టీచర్లు లేక పాఠశాలలు మూసేస్తున్నారని ఆయన అన్నారు. పురుగుల అన్నం, గొడ్డుకారం తినలేక విద్యార్థులు ఏడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుడ్ పాయిజన్, పాము కాట్లు, కుక్క కాట్లు, ఎలుక కాట్లతో రోదిస్తున్నారని, తరగతి గదుల్లో ఉండాల్సిన విద్యార్థులు రోడ్డెక్కి నిరసనలు తెలియజేస్తున్నారని హరీష్ రావు గుర్తుచేశారు.

గురుకులాల ఖ్యాతిని రోజు రోజుకి దిగజార్చుతున్నారని ఆయన మండిపడ్డారు. పాఠాలు చెప్పే ఉపాధ్యాయులను నిర్ధాక్షిణ్యంగా తొలగిస్తున్నారని.. తమ పిల్లల భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని వెల్లడించారు. ఉన్న విద్యా వ్యవస్థను సక్రమంగా నిర్వహించరు కానీ  సమీకృత గురుకులాలు, విద్యా కమిషన్ అంటూ భ్రమలు  కల్పిస్తున్నారని హరీష్ రావు ఎద్దేవా చేశారు. 

newsline-whatsapp-channel
Tags : telangana ts-news news-line newslinetelugu students brs telanganam cm-revanth-reddy residential-teachers harish-rao harishrao residentialschool education

Related Articles