ఓ ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీకి చెందిన కొందరు అధికారులను కూడా పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తుంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఆర్సీబీ ఫ్రాంచైజీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలేను పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబై వెళ్లేందుకు సిధ్దమవుతున్న నిఖిల్ ను బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. బెంగుళూరులో రీసెంట్ గా జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి నమోదైన కేసులో భాగంగా ఈ అరెస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో ఓ ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీకి చెందిన కొందరు అధికారులను కూడా పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం నిఖిల్ సోసాలేను రహస్య ప్రదేశంలో పోలీసులు విచారిస్తున్నట్టు సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు వెలుగులోకి రానున్నాయని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ అరెస్ట్పై ఇప్పటివరకు ఆర్సీబీ యాజమాన్యం గానీ, నిఖిల్ సోసాలే కుటుంబ సభ్యులు గానీ అధికారికంగా స్పందించలేదు. కాని చాలా ఈ అరెస్ట్ చాలా షాకింగ్ గా ఉందని అంటున్నారు.