Whiskey icecream: ఐస్‌క్రీమ్‌లో విస్కీ కలిపి అమ్ముతున్న ముఠా అరెస్ట్

మార్కెట్‌లో విస్కీ ఐస్క్రీమ్ మత్తుమందు కలకలం రేపుతుంది. పిల్లల ఐస్క్రీమ్లో విస్కీ కలిపి అమ్ముతున్న ముఠాను ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేశారు.


Published Sep 06, 2024 01:01:23 AM
postImages/2024-09-06/1725601975_icream.PNG

న్యూస్ లైన్ డెస్క్: మార్కెట్‌లో విస్కీ ఐస్క్రీమ్ మత్తుమందు కలకలం రేపుతుంది. పిల్లల ఐస్క్రీమ్లో విస్కీ కలిపి అమ్ముతున్న ముఠాను ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేశారు. వన్ అండ్ ఫైవ్ ఐస్క్రీమ్ పార్లర్లో శుక్రవారం ఎక్సైజ్ అధికారుల సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీలో ఐస్క్రీమ్లో పేపర్ విస్కీ కలిపి అమ్ముతున్న వన్ అండ్ ఫైవ్ ఐస్క్రీమ్ పార్లర్ యజమానులు దయాకర్ రెడ్డి, శోభన్ లను అధికారులు అరెస్టు చేశారు. 60 గ్రాముల ఐస్క్రీమ్లో 100 మి.లీ విస్కీ కలుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. కాగా, ఈ విస్కీ ఐస్క్రీమ్ కోసం పిల్లలు, యువత ఎగబడుతున్నారు.

పిల్లలు, యువత ఐస్క్రీమ్‌కు జాగ్రత్తగా ఉండాలని, ఎవరైనా ఐస్క్రీమ్‌లో మత్తు పదార్థాలు కలిపి అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు.  

newsline-whatsapp-channel
Tags : telangana ts-news students police arrest

Related Articles