Krishank: స్వచ్ బయో డీల్‌పై ఈడీకి ఫిర్యాదు చేసిన క్రిశాంక్

అన్ని ఆధారాలతో ఈడీకి ఫిర్యాదు చేశానని వెల్లడించారు. ఈడీ అధికారులు కూడా విచారణ చేపడుతాం అని చెప్పారని తెలిపారు. 


Published Aug 20, 2024 05:33:23 PM
postImages/2024-08-20/1724155403_krishank.jpg

న్యూస్ లైన్ డెస్క్: స్వచ్ బయో డీల్‌పై ఢిల్లీలోని ఈడీ సెంట్రల్ ఆఫీసులో BRS సోషల్ మీడియా కన్వినర్ మన్నె క్రిశాంక్ ఫిర్యాదు చేశారు. ఇటీవల అమెరికా పర్యటనలో స్వచ్ బయోతో సీఎం రేవంత్ రెడ్డి ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. అయితే, ఇందులో అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు. 

ఈ మేరకే సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు జగదీష్ రెడ్డిపై ఈడీకి ఫిర్యాదు చేశానని ఆయన అన్నారు. అన్ని ఆధారాలతో ఈడీకి ఫిర్యాదు చేశానని వెల్లడించారు. ఈడీ అధికారులు కూడా విచారణ చేపడుతాం అని చెప్పారని తెలిపారు. 

ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా ఇందులో తప్పేముందని అన్నారు కాబట్టే ఈడీ కార్యాలయానికి వచ్చి పిర్యాదు చేశామని తెలిపారు. దీనిపై పూర్తి వివరాలు రాబట్టేందుకు పిర్యాదు చేశానని క్రిశాంక్ అన్నారు. 
 

newsline-whatsapp-channel
Tags : news-line newslinetelugu brs telanganam mannekrishank swachbio

Related Articles