రేణు దేశాయ్ ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. పవన్ కళ్యాణ్ తో బద్రి సినిమాలో ఎప్పుడైతే నటించిందో అప్పటినుంచి వీరి మధ్య మంచి బాంటింగ్ కుదిరింది. అంతేకాకుండా అది ప్రేమగా మారింది. చివరికి ఇద్దరు పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు జన్మ కూడా ఇచ్చారు. కానీ వీరి మధ్య ఏమైందో ఏమో విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక అప్పటి నుంచి తన ఇద్దరు పిల్లలను చూసుకుంటూ ఒంటరిగానే ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ మరో దేశస్తురాలు అయినటువంటి అన్నా లేజినోవాను పెళ్లి చేసుకున్నారు. ' /> రేణు దేశాయ్ ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. పవన్ కళ్యాణ్ తో బద్రి సినిమాలో ఎప్పుడైతే నటించిందో అప్పటినుంచి వీరి మధ్య మంచి బాంటింగ్ కుదిరింది. అంతేకాకుండా అది ప్రేమగా మారింది. చివరికి ఇద్దరు పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు జన్మ కూడా ఇచ్చారు. కానీ వీరి మధ్య ఏమైందో ఏమో విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక అప్పటి నుంచి తన ఇద్దరు పిల్లలను చూసుకుంటూ ఒంటరిగానే ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ మరో దేశస్తురాలు అయినటువంటి అన్నా లేజినోవాను పెళ్లి చేసుకున్నారు. ' />
న్యూస్ లైన్ డెస్క్: రేణు దేశాయ్ ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. పవన్ కళ్యాణ్ తో బద్రి సినిమాలో ఎప్పుడైతే నటించిందో అప్పటినుంచి వీరి మధ్య మంచి బాంటింగ్ కుదిరింది. అంతేకాకుండా అది ప్రేమగా మారింది. చివరికి ఇద్దరు పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు జన్మ కూడా ఇచ్చారు. కానీ వీరి మధ్య ఏమైందో ఏమో విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక అప్పటి నుంచి తన ఇద్దరు పిల్లలను చూసుకుంటూ ఒంటరిగానే ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ మరో దేశస్తురాలు అయినటువంటి అన్నా లేజినోవాను పెళ్లి చేసుకున్నారు.
కానీ ఇదే సమయంలో పవన్ అభిమానులు ఎప్పుడూ ఏదో ఒక మెసేజ్ తో రేణు దేశాయ్ ను టార్గెట్ చేస్తూనే ఉంటారు. ఏదో ఒక విధంగా ఇబ్బందులు పెడుతూనే ఉంటారు. వీటిపై రేణు దేశాయ్ కూడా గట్టిగానే స్పందిస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చరిత్ర సృష్టించారు. ఇదే తరుణంలో చాలామంది పవన్ అభిమానులు రేణు దేశాయిని టార్గెట్ చేస్తూ నువ్వు దురదృష్టవంతురాలివి అంటూ కామెంట్లు పెట్టారు. అయితే ఈ మెసేజ్ లకు రేణు దేశాయ్ చాలా ఎమోషనల్ అయ్యారు.
నా వ్యక్తిగత జీవితంలోకి వచ్చి తరచూ ఇలాంటి కామెంట్లు పెడుతూ నన్ను అసహనాన్ని గురి చేస్తున్నారని తెలియజేశారు. ఈ మెసేజ్ లు నాకు ఎంతో బాధ కలిగిస్తున్నాయని ప్లీజ్ నన్ను అలా పిలవద్దని, నేను ఎన్నిసార్లు చెప్పినా నా మాట ఎవరు వినడం లేదని నేను అలసిపోయానని చెప్పింది. ఇక ఇప్పటినుంచి నా ఇన్స్టాలో కామెంట్ సెక్షన్ ని ఆఫ్ చేస్తున్నానని, మీరు ఇచ్చే కామెంట్లు చూసి నేను భరించలేకపోతున్నానని నీకు రిప్లై ఇచ్చే శక్తి కూడా నాలో లేదని చెప్పుకొచ్చింది.
https://www.instagram.com/p/C8doCa6B34I/?igsh=bTgzM250MWtyd2Vu
నేను బాధలో ఉన్నప్పుడు నాకు తోడుగా ఉన్న వారందరికీ ధన్యవాదాలు, నన్ను ద్వేషించే వారికి ఒకటే చెబుతున్నా కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. ఏదో ఒక సమయంలో దాన్ని తప్పక ఫేస్ చేయాలని కామెంట్ చేసింది. మీరు ప్రేమతో తీసుకునే నిర్ణయాల వల్ల మీ మనసులని గాయపరిచే అవకాశం ఈ ప్రపంచానికి ఇవ్వొద్దంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆమె ఎమోషనల్ కామెంట్స్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.