Video viral:సూసైడ్ చేసుకోవడానికి వచ్చింది..కానీ పట్టాలపై నిద్రించింది.!

ఈ మధ్యకాలంలో చాలామంది పట్టాలపై నిద్రపోవడం మనం చూస్తూనే ఉన్నాం.  వ్యక్తులు పట్టాలపై ఎంచక్కా పడుకొని ఉన్నప్పుడు రైలు నడిపే వ్యక్తి వారిని చూసి రైలు ఆపిన ఘటనలు మనం సోషల్


Published Sep 10, 2024 08:19:00 PM
postImages/2024-09-10/1725977794_loco.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఈ మధ్యకాలంలో చాలామంది పట్టాలపై నిద్రపోవడం మనం చూస్తూనే ఉన్నాం.  వ్యక్తులు పట్టాలపై ఎంచక్కా పడుకొని ఉన్నప్పుడు రైలు నడిపే వ్యక్తి వారిని చూసి రైలు ఆపిన ఘటనలు మనం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం చూసాం. అయితే తాజాగా బీహార్ రాష్ట్రంలోని  మోతీహారిలో  అలాంటి ఘటనే జరిగింది. అయితే ఒక యువతి  ఆత్మహత్య చేసుకుందామని  పట్టాల పైకి వచ్చింది.

రైలు రావడానికి చాలా లేట్ అయిపోవడంతో  యువతి ఎంచక్కా నిద్రపోయింది. కనీసం రైలు వచ్చే సమయానికి కూడా ఆమె లేవలేదు. దూరం నుంచి గమనించిన   రైలు డ్రైవర్ ఎమర్జెన్సీ బ్రేకులు వేసి కరెక్ట్ గా యువతి  తల దగ్గరికి వచ్చి ఆపేశారు. ఇంకో అంగుళం అయితే ఆ యువతి పైకి రైలు ఎక్కేది. ప్రస్తుతం ఈ వీడియోను వారు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్త వైరల్ గా మారింది.

అయితే ఆ బాలిక పట్టాలపై పడుకొని కనీసం రైలు వచ్చి ఆగి, వాళ్ళు లేపే వరకు కూడా లేవడం లేదు. ఇంతలోనే మరో మహిళా వచ్చి ఆమెను పట్టాల నుంచి లేపి బయటకు తీసుకెళ్లింది. ఈ తతంగం  అంతా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విపరీతంగా వైరల్ అవుతుంది. మరి దీనిపై మీ కామెంట్ ఏంటో చెప్పండి.

https://x.com/jhasureshjourno/status/1833407117593858171?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1833407117593858171%7Ctwgr%5Ee2f030801b0dd13e9d9482475cf218a358e448e4%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F

newsline-whatsapp-channel
Tags : newslinetelugu bihar train narendra-modi young-girl-sleep

Related Articles