Viral news: పెళ్లి కూతురు తో బాండ్ పేపర్ల మీద సంతకాలు చేయించిన ఫ్రెండ్స్ ?

పెళ్లి అయ్యిందా..ఫ్రెండ్స్ , పార్టీస్ కు దూరంగా ఉండాల్సిందే . అందుకే తమిళనాడులోని ఓ ఫ్రెండ్స్ గ్యాంగ్ వెరైటీగా డెసిషన్ తీసుకున్నారు.


Published Sep 17, 2024 10:01:00 AM
postImages/2024-09-17/1726547524_Screenshot20240917095921.png

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఎవ్వరికైనా పెళ్లి అనగానే ఏదో కోల్పోతున్నట్లు..తమను ఎవరో రూల్ చేస్తున్నట్లు ఫీలవుతుంటారు. డైరక్ట్ గా మా ఫ్రీడమ్ పోయిందంటారు. పెళ్లి అయ్యిందా..ఫ్రెండ్స్ , పార్టీస్ కు దూరంగా ఉండాల్సిందే . అందుకే తమిళనాడులోని ఓ ఫ్రెండ్స్ గ్యాంగ్ వెరైటీగా డెసిషన్ తీసుకున్నారు.


తన ఫ్రెండ్ కు పెళ్లి తర్వాత కూడా పూర్తి స్వేఛ్ఛను ఇవ్వాలని వధువుతో మాట ఇప్పించుకున్నారు. పెళ్లి తంతు అయ్యాక ఎక్కడ మాట మార్చేస్తుందో అని ఓ బాండ్ పేపర్ మీద సంతకాలు కూడా చేయించుకున్నారు.తమిళనాడులోని మైలాడుదురై జిల్లా సీర్గాళి సమీప తెన్‌పాడులో జరిగింది. ముత్తుకుమార్‌ అనే వ్యక్తికి కురింజిపాడికి చెందిన పవిత్రతో సోమవారం వివాహం జరిగింది. వివాహం పాల్గొన్న ముత్తుకుమార్‌ స్నేహితులు. వధవుతో స్టాంప్‌ పేపర్‌పై సంతకం చేయించుకున్నారు. మాట మారిస్తే కేసు వేస్తాం చూస్కో అంటూ నవ్వుల వార్నింగ్ కూడా ఇచ్చారు.


అయితే తన ఫ్రెండ్ ను ఎప్పుడు కావల్సివస్తే అప్పుడు తమతో పార్టీలకు..ట్రిప్పులకు కూడా పంపించాలని ..స్టాంప్ పేపర్ ను తీసుకొచ్చి సంతకాలు చేయించుకున్నారు. తమ ఫ్రెండ్స్ తో కలిసి హ్యాపీగా ఉండనిస్తానని ..భార్య ఒప్పుకోవాలని అందులో ఉంది. ఆమె కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా సంతోషంగా సంతకం చేశారు. దీంతో ఈ సంఘటనకు సంబంధించి వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. ఫస్ట్ అలానే చెప్తారు భయ్యా...తర్వాత లైఫ్ వేరేలా ఉంటుందంటున్నారు నెటిజన్లు.

newsline-whatsapp-channel
Tags : viral-news wedding tamilnadu

Related Articles