సోనమ్ తమ కుటుంబ సభ్యులకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండానే ఏకపక్షంగా ఫ్లైట్ టికెట్లు బుక్ చేసిందని ఆమె తెలిపారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: పాపం పెళ్లి చేసుకొని ఎన్నో కలలు కన్నాడు. భార్యతో సంతోషంగా గడుపుదామనుకున్నాడు. ప్రశాతంగా తన భార్యతో హనీమూన్ కోసం ఇండోర్ నుంచి మేఘాలయ వెళ్లి అక్కడ హత్యకు గురైయ్యాడు ఓ కొత్త పెళ్లికొడుకు. రీసెంట్ గా పెళ్లి చేసుకున్న రాజారఘవంశీ, తన భార్య సోనమ్ తో కలిసి హనీమూన్ కు వెళ్లారు. అక్కడే అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. ఈ ఇన్సిడెంట్ తో రాజా తల్లి ఉమా రఘువంశీ కొన్ని నిజాలు తెలిపారు. తన కుమారుడికి అసలు ఆ ట్రిప్కు వెళ్లడం ఇష్టం లేదని, సోనమ్ తమ కుటుంబ సభ్యులకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండానే ఏకపక్షంగా ఫ్లైట్ టికెట్లు బుక్ చేసిందని ఆమె తెలిపారు.
అంతేకాదు ఆ ట్రిప్ కు వెళ్లాలని లేదు . మా ఫ్యామిలీకి చెప్పకుండా సోనమ్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయడంపై కాస్త అసహనం కూడా వ్యక్తం చేశాడు ఆమె ఈ హత్య చేయించిందని అనుమానమంటు చెప్పుకొచ్చింది. విచారణ జరుగుతుంది ..అదే నిజమని తేలితే మాత్రం ఆమెకు మరణశిక్ష విధించాలని అన్నారు. తన కుమారుడిని సోనమ్ బలవంతంగానే మేఘాలయకు తీసుకెళ్లిందని, అక్కడ పక్కా ప్రణాళికతో హత్య చేయించిందని ఆమె ఆరోపించారు. ఈ ఆరోపణలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లి అదృశ్యమైన నూతన జంట కేసు మిస్టరీ వీడింది. భర్త రాజ రఘువంశీని భార్య సోనమే చంపినట్లు పోలీసులు తేల్చారు. కాంట్రాక్ట్ కిల్లర్లకు సుపారీ ఇచ్చి సోనమ్ తన భర్తను హత్య చేయించినట్లు గుర్తించారు పోలీసులు.