Narsingi: ఇంజినీర్‌ దారుణ హత్య

అయితే, ఇజాయత్‌ అలీని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి గొంతు కోసి దుండగులు హతమార్చినట్లు పోలీసులు తెలిపారు.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-06-29/1719661296_Untitleddesign41.jpg

న్యూస్ లైన్ డెస్క్: రంగారెడ్డి(Rangareddy) జిల్లా నార్సింగి(Narsingi)లో ఓ ఇంజినీర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. ఇజాయత్‌ అలీ(Izayath ali) అనే ఇంజనీర్‌ను దుండగులు గొంతుకోసి చంపేశారు. దుబాయ్‌(Dubai) నుంచి 20 రోజుల క్రితమే హైదరాబాద్‌ ఇజాయత్‌ అలీ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఇజాయత్‌ అలీని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి గొంతు కోసి దుండగులు హతమార్చినట్లు పోలీసులు తెలిపారు.

కారులో ఇద్దరు యువకులు, యువతి వచ్చి హత్య చేసినట్లు ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు. క్వాలిస్‌ వాహనాన్ని హత్య స్థలంలోనే వదిలేసి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. వాహనంతో పాటు 2 ఫోన్లను కూడా నార్సింగి పోలీసులు సీజ్‌ చేశారు. ఘటనాస్థలంలో ఆధారాలను క్లూస్‌ టీమ్‌, పోలీసులు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. 
 

newsline-whatsapp-channel
Tags : telangana newslinetelugu telanganam rangareddy crime narsingi izayath-ali

Related Articles