Food poison: 50 మంది విద్యార్థులకు అస్వస్థత

హాస్టల్‌లో కడుపునొప్పితో ఇబ్బంది పడుతున్న విద్యార్థినులను అర్ధరాత్రి హాస్పిటల్‌కు తరలించారు. విద్యార్థినులను పరీక్షించిన  డాక్టర్లు ఫుడ్ పాయిజన్ అయినట్లుగా గుర్తించారు. 
 


Published Aug 31, 2024 11:33:47 AM
postImages/2024-08-31/1725084227_foodpoisoninaraku.jpg

న్యూస్ లైన్ డెస్క్: అరకులో 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అరకు డంబ్రిగూడ మండల పరిధిలోని బొందుగూడ  గిరిజన సంక్షేమ బాలికల ఉన్నత పాఠశాలకు సంబంధించిన హాస్టల్‌లో కడుపునొప్పితో ఇబ్బంది పడుతున్న విద్యార్థినులను అర్ధరాత్రి హాస్పిటల్‌కు తరలించారు. విద్యార్థినులను పరీక్షించిన డాక్టర్లు ఫుడ్ పాయిజన్ అయినట్లుగా గుర్తించారు. 

కలుషితమైన ఆహారం తీసుకోవడం వల్లనే ఒకేసారి 50 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు వెల్లడించారు. ప్రస్తుతం విద్యార్థినులకు అరకు లోయ హాస్పిటల్‌లోనే చికిత్స అందిస్తున్నారు. అయితే, హాస్పిటల్‌లో బెడ్లు సరిపోక పోవడంతో ఒకే బెడ్‌పై ఇద్దరిని ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. 

newsline-whatsapp-channel
Tags : ap-news news-line newslinetelugu students telanganam food-poison

Related Articles