కొండా సురేఖ కామెంట్స్ పై..jrఎన్టీఆర్ సీరియస్.!

 తాజాగా తెలంగాణ మంత్రి కొండా సురేఖ మీడియా ఎదుట సంచలనమైన కామెంట్స్ చేశారు. ఫోన్ టాపింగ్ తో కేటీఆర్  ఎంతోమంది హీరోయిన్ల జీవితాలు నాశనం చేశాడని అన్నారు. ముఖ్యంగా సమంత, నాగచైతన్య


Published Oct 03, 2024 07:39:38 AM
postImages/2024-10-03/1727921378_konfa.jpg

న్యూస్ లైన్ డెస్క్: తాజాగా తెలంగాణ మంత్రి కొండా సురేఖ మీడియా ఎదుట సంచలనమైన కామెంట్స్ చేశారు. ఫోన్ టాపింగ్ తో కేటీఆర్  ఎంతోమంది హీరోయిన్ల జీవితాలు నాశనం చేశాడని అన్నారు. ముఖ్యంగా సమంత, నాగచైతన్య విడాకుల కారణం కేటీఆర్ అని, సమంతాను  కేటీఆర్ తన దగ్గరికి రమ్మని కోరినట్లు దానికోసం ఒప్పుకోకపోతే N కన్వెన్షన్ హాల్ కూల్చివేస్తామని బెదిరించాడని కొండా సురేఖ కామెంట్లు చేసింది. అయితే దీనిపై నాగార్జున, సమంతాను కేటీఆర్ దగ్గరికి వెళ్లి రా అని అనడం వల్ల ఆమె సీరియస్ అయిపోయి  నాగచైతన్య విడాకులు ఇచ్చిందని కొండా సురేఖ ఆరోపించింది.

 దీనిపై స్పందించినటువంటి నాగార్జున చాలా సీరియస్ అయ్యారు. దీనిపై జూనియర్ ఎన్టీఆర్ తాజాగా స్పందించారు.. ట్విట్టర్ వేదికగా ఆయన ఇలా అన్నారు.. కొండా సురేఖ గారు వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగడం  మంచిది కాదు.  ముఖ్యంగా పబ్లిక్ ఫిగర్లు ప్రత్యేకించి మీలాంటి బాధ్యతయుతమైన స్థానాల్లో ఉండి ఇతరుల  గౌరవాల పట్ల ఇలా మాట్లాడడం దారుణం.  ముఖ్యంగా సినిమా పరిశ్రమ వాళ్ళపై ఇంత నిర్లక్ష్యపూరితంగా మాట్లాడుతున్న మాటలు చాలా నిరుత్సాహపరిచాయి.

ఇలా వాస్తవం కానీ మాటలను సినీ ఇండస్ట్రీపై రుద్దితే మేము చూస్తూ ఊరుకోము. ఎవరి గోప్యతపై వారికి గౌరవం ఉంటుంది.  ఇలా నిర్లక్ష్య పూరితంగా ప్రవర్తిస్తూ సమాజం ఛీ కొట్టే విధంగా మాట్లాడడం  మంచిది కాదన్నారు. దీనిపై సినీ పరిశ్రమ చూస్తూ ఊరుకోదని ప్రతి ఒక్కరు స్పందించాలని కోరారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఇలా కామెంట్లు చేయడంతో ఆయన అభిమానులు కొండా సురేఖను తిట్టిపోస్తున్నారు.

https://x.com/tarak9999/status/1841571689982730392?t=kI3E67eyasV7DtUbgHv9qg&s=08

newsline-whatsapp-channel
Tags : news-line jr-ntr nagarjuna samantha nagachaitanya konda-surekha

Related Articles