Bigg Boss 6: మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ఊహించని కంటెస్టెంట్ బలి.?

బిగ్ బాస్ సీజన్ ఏదైనా సరే ముందు కాస్త చప్పగా సాగి ఆ తర్వాత షో చాలా రసవత్తరంగా సాగుతుంది. అయితే తెలుగు బిగ్ బాస్ 8 రియాల్టీ షో కూడా ప్రస్తుతం రసవత్తరంగా మారింది. ఇప్పటికే నలుగురు కంటెస్టెంట్లు హౌస్ వదిలి బయటికి


Published Oct 04, 2024 04:58:56 PM
postImages/2024-10-04//1728041336_biggboss8.jpg

న్యూస్ లైన్ డెస్క్: బిగ్ బాస్ సీజన్ ఏదైనా సరే ముందు కాస్త చప్పగా సాగి ఆ తర్వాత షో చాలా రసవత్తరంగా సాగుతుంది. అయితే తెలుగు బిగ్ బాస్ 8 రియాల్టీ షో కూడా ప్రస్తుతం రసవత్తరంగా మారింది. ఇప్పటికే నలుగురు కంటెస్టెంట్లు హౌస్ వదిలి బయటికి వెళ్లిపోయారు. అలాగే మిడిల్ లో మరొకరు ఎలిమినేట్ అవుతారు అని నాగార్జున గత వారం షో ముగిసే సమయంలో చెప్పారు.

అంతేకాకుండా వైల్డ్ కార్డు ఎంట్రీలు కూడా ఉంటాయని వారికి సంబంధించిన ఫేస్ చూపించకుండా కొంతమందిని చూపించారు.అయితే తాజాగా మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ఆ కంటెస్టెంట్ బలి అయినట్టు తెలుస్తోంది. ఇక విషయంలోకి వెళ్తే.. బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం యష్మీ, ప్రేరణ, విష్ణు ప్రియ,నబిల్, నిఖిల్,నైనిక,సీత,మణికంఠ, ఆదిత్య ఓం, పృథ్వీ ఉన్నారు.. వీరిలో నిఖిల్, మణికంఠ, నబిల్ లకి మంచి ఓట్లు పడడంతో వాళ్లు సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయారు.

ఆ తర్వాత నామినేషన్ లో ఉన్న విష్ణు ప్రియ,నబిల్ , నిఖిల్ ,  నైనిక,మణికంఠ, ఆదిత్య ఓం లు ఉన్నారు. వీరిలో నిఖిల్ , మణికంఠ, నబిల్ లు సేఫ్ అవ్వడం తో డేంజర్ జోన్ లో ఉన్న నైనిక, విష్ణు ప్రియ, ఆదిత్య ఓం లను లగేజ్ సర్దుకోమని బిగ్ బాస్ చెప్పడంతో నైనిక నేను వెళ్ళను అని గట్టిగా ఏడ్చేసింది.దాంతో ఆమెను ఇంట్లో వాళ్ళు ఓదార్చారు.

 అయిత డేంజర్ జోన్ లో ఉన్న వారిని ఎలిమినేట్ చేసే బాధ్యతను హౌస్ మేట్స్ కి వదిలేసారు బిగ్ బాస్.దాంతో సీత, మణికంఠ,యష్మీ నిఖిల్ నలుగురు కలిసి ఆదిత్య ఓం మీద కారణాలు చెప్పారు. అలా చివరిగా అందరికంటే ఎక్కువ ఓట్లు ఆదిత్య ఓం కి పడడంతో ఆయన ఎలిమినేట్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

newsline-whatsapp-channel
Tags : news-line bigg-boss-8 vishnu-priya nainika adithya-om-

Related Articles