MBBS Course: బీహార్ లోనూ హిందీలో ఎంబీబీఎస్ కోర్సు

Published 2024-07-05 12:11:47

postImages/2024-07-05/1720161707_image.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : ఎంబీబీఎస్ కోర్సును ప్రస్తుతం ఉన్న ఇంగ్లీష్ మీడియం తో పాటు హిందీ మీడియంలోను అందించాలని బీహార్ ప్రభుత్వం నిర్ణయించింది. మధ్యప్రదేశ్ తర్వాత హిందీ మీడియంలో ఎంబీబీఎస్ కోర్సును ప్రవేశపెట్టిన రెండో రాష్ట్రంగా రికార్డు క్రియేట్ చేసుకుంది. ఎంబీఎస్ కోర్సును ప్రస్తుతం హిందీ మీడియంలో ఫస్ట్ మధ్యప్రదేశ్ ఇంట్రడ్యూస్ చేసింది.


మధ్యప్రదేశ్ తర్వాత హిందీ మాధ్యమంలో ఎంబీబీఎస్ కోర్సును ప్రవేశపెట్టిన రెండో రాష్ర్టంగా బీహార్ గా నిలిచింది. ఈ మేరకు బీహార్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మంగళ్ పాండే తాజాగా ప్రకటన చేశారు. త్వరలో మొదలయ్యే విద్యాసంవత్సరం నుంచి విద్యార్థులు హిందీ మీడియంలో చదవొచ్చని చెప్పారు. పుస్తకాలు కూడా హిందీ మీడియంలో అందుబాటులో వస్తాయని తెలిపారు. హిందీని ప్రపంచ భాషగా మార్చాలనేది మా ఉద్దేశం’ అని మంత్రి మంగళ్ పాండే వివరించారు.  


నీట్ యూజీ–2024 పాసైన విద్యార్థులకు ఢిల్లీ ఎయిమ్స్ సిలబస్ కు అనుగుణంగా హిందీ మాధ్యమంలో కొత్త కోర్సును అమలు చేస్తామని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో 85 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని వాటిలో కూడా హింది మీడియం ద్వారానే బోధన జరుగుతుందని తెలిపారు. కావాలనుకున్న వారు మాత్రమే ...అది కూడా కార్పోరేట్ స్కూల్ లో మాత్రమే ...ఇంగ్లీష్ మీడియం చదివే అవకాశముందని తెలిపారు.


ప్రభుత్వం హిందీ మీడియం ప్రవేశపెట్టినా ...స్టూడెంట్స్ మాత్రం ఇంగ్లీష్ మీడియంకే  ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.  నెలలు గడిచినప్పటికీ హిందీలో ఎంబీబీఎస్ కోర్సు చేసేందుకు విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఎడ్యుకేషన్ టైమ్స్ గణాంకాల ప్రకారం.. భోపాల్ లోని గాంధీ మెడికల్ కాలేజీలో 250 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా కేవలం 25 మంది విద్యార్థులే హిందీ మాధ్యమంలో చదివేందుకు ఇష్టపడ్డారు. మిగిలిన విద్యార్ధులంతా ...ఇంగ్లీష్ మీడియంకే ఓటు వేయడం...గమనార్హం.