వారిద్దరి మార్చి 19 న భూమి మీదకు తీసుకువస్తామని ఇంతకు ముందు నాసా ప్రకటించింది. ఇప్పుడు ఆ తేదిని కాస్త ముందుకు జరిపింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : అంతర్జాతీయ కేంద్రంలో చిక్కుకుపోయిన నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్ , బుచ్ విల్మోర్ ను మార్చిన 16న భూమి మీదరకు తీసుకువస్తున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. స్పేస్ ఎక్స్ డ్రాగన్ లో వారిద్దరిని భూమిపైకి తీసుకురానున్నామని నాసా చెప్పింది. సునీతా , బుచ్ విల్మోర్ తొమ్మిది నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉన్నారు.వారిద్దరి మార్చి 19 న భూమి మీదకు తీసుకువస్తామని ఇంతకు ముందు నాసా ప్రకటించింది. ఇప్పుడు ఆ తేదిని కాస్త ముందుకు జరిపింది.
నాసా, స్పేస్ ఎక్స్ చేపట్టిన క్రూ-9 మిషన్ను అంతరిక్ష కేంద్రానికి పంపించారు. క్రూ-9 సిబ్బందిని రిలీవ్ చేసేందుకు వెళ్లే క్రూ -10 ప్రయోగం బుధవారం జరిగే అవకాశం ఉంది. ఇందుకు సంబందించిన ఏర్పాట్లను ఇప్పటికే అదికారులు పూర్తి చేసుకున్నారు.సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ గత ఏడాది జూన్ 5న బోయింగ్ స్టార్లైనర్ క్యాప్సూల్లో ఐఎస్ఎస్కి వెళ్లారు. అయితే, స్టార్లైనర్ ప్రొపల్షన్, థ్రస్టర్ సిస్టమ్లలో సమస్యలతో వారు అక్కడి నుంచి తిరిగి రాలేకపోయారు.
తొమ్మిది నెలలకు పైగా అక్కడే ఉంటున్నారు. వారిని తిరిగి భూమి మీదకు తీసుకురావడానికి నాసా , స్పేస్ ఎక్స్ కలిసి పనిచేస్తున్నాయి. స్టార్ లైనర్ లో వారు రావడం కుదరకపోవడంతో స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ లో తిరిగి వచ్చేలా నాసా ఏర్పాట్లు చేసింది. క్రూ -10 మిషన్ ప్రయోగం జరిగిన తర్వాత విలియమ్స్ , విల్మోర్ అమెరికా కు తిరిగి ప్రయాణానికి సిధ్ధమవుతారు. దీంతో వారు భూమి మీదకు రాగానే వారికి వైద్యపరీక్షలు చేసి చికిత్స అందించే అవకాశం ఉంది.