Advocate Sharath: న్యూస్ పేపర్లన్నీ రేవంత్‌ను జోకుతున్నాయి

రేవంత్ రెడ్డి పరువు ప్రతిష్టలు కాపాడేందుకే మీడియా, పేపర్లు పనిచేస్తున్నాయని అన్నారు. ఆయనకు నచ్చని వార్తలను కూడా న్యూస్ పేపర్లు ప్రచురించడం మానేసాయని అన్నారు. 


Published Jul 25, 2024 04:17:41 PM
postImages/2024-07-25/1721904461_rtfgduyh.jpg

న్యూస్ లైన్ డెస్క్: న్యూస్ పేపర్లన్నీ రేవంత్‌ను జోకుతున్నాయని అడ్వకేట్ శరత్ అన్నారు. ఇటీవల ఓ ఇంటర్‌వ్యూలో మాట్లాడిన ఆయన మీడియా, న్యూస్ పేపర్ల తీరుపై విరుచుకుపడ్డారు. 

మీడియా, న్యూస్ పేపర్లన్నీ సీఎం రేవంత్ రెడ్డికి అమ్ముడుపోయాయని ఆయన వివర్శించారు. మీడియాకు కావాల్సిన యాడ్స్ కోసం రేవంత్ రెడ్డి పేరున భజన చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. మీడియా అంతా రేవంత్ రెడ్డికి బానిసగా మారిందని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి పరువు ప్రతిష్టలు కాపాడేందుకే మీడియా, పేపర్లు పనిచేస్తున్నాయని అన్నారు. ఆయనకు నచ్చని వార్తలను కూడా న్యూస్ పేపర్లు ప్రచురించడం మానేసాయని అన్నారు. 

పత్రికలు పోషించాల్సిన పాత్రను ప్రస్తుత న్యూస్ పేపర్లు అసలు పోషించడం లేదని అన్నారు. ఏ ఒక్క న్యూస్ పేపర్ సంస్థను కూడా నెమ్మే అవకాశం లేకుండా పోయిందని వెల్లడించారు. అందుకే అందరూ సోషల్ మీడియానే వాడుతున్నారని, న్యూస్ పేపర్లను చదివేందుకు కూడా ఇష్టపడడం లేదని శరత్ తెలిపారు. ఈ వార్త పేపర్లన్నీ సమోసాలు, బజ్జీలు, చపాతీలు పొట్లం కట్టేందుకు తప్ప దేనికి పనికి రావని ఎద్దేవా చేశారు. 

newsline-whatsapp-channel
Tags : telangana ts-news revanth-reddy news-line newslinetelugu tspolitics congress telanganam main-stream-media advocatesharath newspapers

Related Articles