GHMC Commissioner: జోనల్ కమిషనర్లకు ఆమ్రపాలి కీలక ఆదేశాలు

సఫ్దర్ నగర్‌లోని వరద ప్రభావిత ప్రాంతాన్ని కూడా ఆమ్రపాలి సందర్శించి ప్రజలతో మాట్లాడారు. ముందుగా ముంపునకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్‌ను ఆదేశించారు.
 


Published Sep 03, 2024 03:54:11 PM
postImages/2024-09-03/1725359051_amrapaliinkukatpally.jpg

న్యూస్ లైన్ డెస్క్:  జోనల్ కమిషనర్లకు GHMC కమిషనర్ ఆమ్రపాలి కీలక ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం కూకట్‌పల్లి మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆమె ఆకస్మికంగా పర్యటించి ముంపు ప్రాంతాలను పరిశీలించారు. మైసమ్మ చెరువు, ఐడీఎల్ చెరువు, సఫ్దర్ నగర్ ముంపు ప్రాంతాలను పరిశీలించారు. 

సఫ్దర్ నగర్‌లోని వరద ప్రభావిత ప్రాంతాన్ని కూడా ఆమ్రపాలి సందర్శించి ప్రజలతో మాట్లాడారు. ముందుగా ముంపునకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్‌ను ఆదేశించారు.

ముంపునకు గురైన కాలనీ వాసులకు రక్షిత మంచినీటిని సరఫరా చేయాలని, దోమల నివారణకు ఏఎల్‌ఓ, ఫాగింగ్‌ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఐడీఎల్, మైసమ్మ చెరువుల వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.


 

newsline-whatsapp-channel
Tags : telangana news-line newslinetelugu hyderabad telanganam amrapali ghmc kukatpally ghmc-commissioner floods

Related Articles