praneeth hanumantwo: ప్రణీత్ హనుమంతుపై మరో కేసు

ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉన్న హనుమంతుపై మరో కేసు నమోదైంది. ప్రణీత్ హనుమంత్‌పై డ్రగ్స్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇటీవల అరెస్ట్ అయిన హనుమంతుకు వైద్య పరీక్షలు చేయించారు. ఇందులో భాగంగానే హనుమంతు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్దారణ అయిందని అధికారులు తెలిపారు. గంజాయి తీసుకున్నట్లు పరీక్షల్లో తేలిందని పోలీసులు కూడా తెలిపారు. 


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-19/1721371992_modi20240719T122026.357.jpg

న్యూస్ లైన్ డెస్క్: తండ్రీకూతుళ్ల బంధంపై అసభ్య వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ప్రణీత్‌పై మరో కేసు నమోదైంది. తండ్రీకూతుళ్లకు సంబంధించిన ఓ వీడియోపై ఇటీవల స్నేహితులతో కలిసి హనుమంతు అసభ్యంగా మాట్లాడుతూ లైవ్ స్ట్రీమింగ్ చేసిన విషయం తెలిసిందే. అతను చేసిన వీడియో సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపడంతో పలువురు ప్రముఖులు, నటులు హనుమంతుపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో బెంగళూరులో సైబర్ సెక్యూరిటీ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. 
 
అయితే, ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉన్న హనుమంతుపై మరో కేసు నమోదైంది. ప్రణీత్ హనుమంత్‌పై డ్రగ్స్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇటీవల అరెస్ట్ అయిన హనుమంతుకు వైద్య పరీక్షలు చేయించారు. ఇందులో భాగంగానే హనుమంతు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్దారణ అయిందని అధికారులు తెలిపారు. గంజాయి తీసుకున్నట్లు పరీక్షల్లో తేలిందని పోలీసులు కూడా తెలిపారు. 

దీంతో హనుమంతుపై 67బి, ఐటీ యాక్ట్, ఫోక్స్ యాక్ట్, 79,294 బీఎన్ఎస్‌తో పాటు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే హనుమంతుని మరో మూడు రోజుల పాటు కస్టడీలో ఉంచాలని కోరుతూ సైబర్ సెక్యూరిటీ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో హనుమంతు తరఫు లాయర్‌కు న్యాయస్థానం నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది. 
 

newsline-whatsapp-channel
Tags : news-line newslinetelugu telanganam police social-media youtuberhanumantu phanumantwo

Related Articles