BRS: కవిత బెయిల్‌పై హర్షం వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశారు.


Published Aug 27, 2024 05:21:50 AM
postImages/2024-08-27/1724750504_happy.PNG

న్యూస్ లైన్ డెస్క్: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను పలువురు బీఆర్ఎస్ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సుప్రీం కోర్టుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. చివరికి కవిత కేసులో న్యాయం గెలిచిందని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం పాలసి కేసులో మంగళవారం కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈడీ, సీబీఐ కేసులో కవిత దాదాపు నాలుగు నెలల పాటు తీహార్ జైలులో ఉన్నారు. 
 

newsline-whatsapp-channel
Tags : kcr telangana mla brs ktr mlc-kavitha padi-kouwsik-reddy

Related Articles