Krishank: ఫ్రాడ్ పెట్టుబడుల కోసం అమెరికా టూర్

స్ట్రైక్ఆఫ్ అయిన కంపెనీ తెలంగాణలో ఎట్లా పెట్టుబడులు పెడుతుందని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.


Published Aug 06, 2024 03:28:34 PM
postImages/2024-08-06/1722938314_fake2.PNG

న్యూస్ లైన్ డెస్క్: స్ట్రైక్ఆఫ్ అయిన కంపెనీ తెలంగాణలో ఎట్లా పెట్టుబడులు పెడుతుందని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంగళవారం  తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కేసీఆర్ హయాంలో తీసుకున్న నిర్ణయాలతో తెలంగాణలో పెట్టుబడులు పెరిగాయి అని, బీఆర్ఎస్ హయాంలో ఐటీ పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి అన్నారు. 2023 నుండి 2024 వరకు పెట్టుబడులు సగం పడిపోయాయి అని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే దావోస్ వెళ్లి గోదీ ఇండియా అనే సంస్ధతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అది ఒక ఫ్రాడ్ కంపెనీ అని తేలిందని అన్నారు. మూసీ ప్రాజెక్టుపై లక్షన్నర కోట్ల రూపాయలకు అంచనాలు పెంచారని, మూసీ ప్రాజెక్టు అప్పగించే సంస్థపై లుక్అవుట్ నోటీసు వచ్చిందన్నారు. తెలంగాణ మహిళలకు ఉపయోగపడే రూ. 839 కోట్ల పెట్టుబడి వచ్చిందని, వాల్ష్ కర్రా హోల్డింగ్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నామని సీఎం కార్యాలయం తెలిపిందన్నారు. సీఎం అమెరికా పర్యటనలో ఉన్నారు.. సీఎం తమ్ముడు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారని ఆరోపించారు. వాల్ష్ కర్రా హోల్డింగ్స్ నాలుగు నెలల క్రితమే ప్రారంభం అయిందని తెలిపారు. ఈ కంపెనీకి కేవలం ఇద్దరు డైరెక్టర్లు ఉన్నారని, వారిద్దరికీ చెరో యాభై షేర్లు ఉన్నాయి అన్నారు. 

ఫ్రాడ్ కంపెనీల నుంచి పెట్టుబడుల కోసం సీఎం రేవంత్ రెడ్డి అమెరికాకు వెళ్ళారా అని నిలదీశారు. సీఎంది ప్రైవేటు పర్యటన కాదు అధికారిక పర్యటన అని గుర్తు పెట్టుకోవాలన్నారు. తెలంగాణ ప్రజల ధనంతో బృందాలుగా అమెరికా, ఆస్ట్రేలియా పర్యటనలకు వెళ్ళారని ఆరోపించారు. విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు తెలంగాణకు పెట్టుబడుల కోసం ఒరిజినల్ కోసం కంపెనీలను తీసుకురండి అన్నారు. ఇప్పటి వరకు తెలంగాణ ఆడబిడ్డలకు మహాలక్ష్మీ పథకం కింద రూ. 2,500 ఇస్తామని ప్రభుత్వం ఇవ్వలేదని, బోగస్ కంపెనీలు తెలంగాణ మహిళల కోసం పెట్టుబడులు ఎట్లా పెడతాయి అని నిలదీశారు. కేటీఆర్ కంటే తాను మెరుగ్గా చేశానని చెప్పడం కోసం సీఎం రేవంత్ రెడ్డి బోగస్ కంపెనీలతో ఒప్పందం చేసుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎవరితో ఒప్పందం చేసుకున్నా వారి ట్రాక్‌ రికార్డ్ మంచిగా ఉండాలని క్రిశాంక్ సూచించారు. 

newsline-whatsapp-channel
Tags : telangana brs cm-revanth-reddy america mannekrishank

Related Articles