Harish Rao: పరామర్శించడానికి వస్తే దాడులు చేస్తారా..?

కాంగ్రెస్ గుండాల దాడిలో గాయపడిన సంతోష్ రెడ్డిని ఖమ్మం మమత హాస్పిటల్‌లో మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పరామర్శించారు.


Published Sep 03, 2024 07:21:43 AM
postImages/2024-09-03/1725365306_manonfire.PNG

న్యూస్ లైన్ డెస్క్: కాంగ్రెస్ గుండాల దాడిలో గాయపడిన సంతోష్ రెడ్డిని ఖమ్మం మమత హాస్పిటల్‌లో మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పరామర్శించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కార్ వరద బాధితులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ప్రభుత్వం సహాయం చేయకుండా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఖమ్మంలో వరద బాధితులను పరామర్శించడానికి వస్తే కాంగ్రెస్ గుండాలు తమపై దాడులు చేయడం దుర్మార్గమైన చర్య అని హరీస్ రావు మండిపడ్డారు. గాయపడిన సంతోష్ రెడ్డికి ఆయన ధైర్యం చెప్పి అన్ని విధాలుగా బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని, సంతోష్ రెడ్డిని ఆదుకుంటామని ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పారు.

newsline-whatsapp-channel
Tags : telangana mla brs congress cm-revanth-reddy harish-rao khammam-floods

Related Articles