Sabitha: మైక్ ఇవ్వడానికి భయపడుతున్నారు

తెలంగాణ శాసనసభలో మహిళలకు రెండు నిమిషాలు మైక్ ఇవ్వడానికి ప్రభుత్వం భయపడుతుందని మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి అన్నారు.


Published Aug 01, 2024 06:57:13 AM
postImages/2024-08-01/1722511687_sabitha.PNG

న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణ శాసనసభలో మహిళలకు రెండు నిమిషాలు మైక్ ఇవ్వడానికి ప్రభుత్వం భయపడుతుందని మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, ఈ అంశంపై అసెంబ్లీలో మాట్లాడాలని చూస్తే మైక్ ఇవ్వలూదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు, చిన్న పిల్లలపై అత్యాచారాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. 8 నెలల కాలంలో రాష్ట్రంలో అత్యాచారాలు పెరిగిపోయాయి అని, లా అండ్ ఆర్డర్ పూర్తి దెబ్బతినదని తెలిపారు. ఒకప్పుడు హైదరాబాద్‌లో రేప్ కేసు జరిగితే హంగామా చేసేవాళ్లు అన్నారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో.. సాయంత్రం వచ్చే సరికి ఎన్ని జరిగాయో లెక్క పెట్టుకోవాల్సి వస్తుందని  సబితా ఇంద్రారెడ్డి అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా పాలన, ఇందిరమ్మ పాలన అని ఊదరగొడుతున్నారు. మహిళలకు ఇచ్చిన హామీలే కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చాయి అని, మహిళలు రాష్ట్రంలో భయంతో బతకాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయిని, ఇదే విషయాన్ని అసెంబ్లీలో తను ప్రస్తావించానాని తెలిపారు. అసెంబ్లీలో మహిళలకు మైక్ ఇవ్వడానికి ఈ సీఎం రేవంత్ రెడ్డి భయపడుతున్నారని, తము నాలుగున్నర గంటలు అసెంబ్లీలో నిలబడితే సీఎం, అధికార పక్షం వాళ్ళు రాక్షసానందం పొందుతున్నారు. ఆడబిడ్డలు నిలబడితే వాళ్ళు ఆనందిస్తున్నారు, వైఎస్, చంద్రబాబు, కేసీఆర్‌లను సీఎంలుగా చూశామని, వాళ్ళు మహిళలు ఇన్ని గంటలు నిలబడితే స్పందించేవారు అన్నారు. ఎస్సీ వర్గీకరణపై కోవా లక్ష్మీ మాట్లాడాలి అనుకుంటే ఆమెకు కూడా మైక్ ఇవ్వలేదని, మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే కనీస స్పందన లేదు.. గతంలో ఇలా ఎప్పుడు లేదన్నారు. స్పీకర్ కూడా తమా వినతిని పట్టించుకోలేదని, అంబేద్కర్ దళితుల గురించే కాదు మహిళలకు ఇవ్వాల్సిన గౌరవం గురించి కూడా చెప్పారు. దాన్ని కనీసం పాటించలేదని విమర్శించారు. తమా పేరు తీసుకున్నపుడు తమ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని, భట్టి సీఎం పదవి కోసం కొట్లాడాల్సింది పొయి సీఎల్పీ పదవి తమా వల్ల పోయింది అంటున్నారు. అసెంబ్లీలో ఇపుడున్న వాళ్లలో ఎంతమంది పార్టీలు మారలేదని, సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని పార్టీలు మారారు అని ప్రశ్నించారు. ఈరోజు కూడా సీఎం రేవంత్ మమ్మల్ని మళ్ళీ నిందించారు. సభలో లేని ఎమ్మెల్సీ కవిత పేరును సీఎం తీసుకోవడం ఎంత వరకు కరెక్టు అన్నారు. 

ఆడబిడ్డలను అవమానించడమే ఈ సీఎంకు నిత్యకృత్యంగా మారిందని, సీఎం పదవి కున్న గౌరవాన్ని రేవంత్ కాపాడుకుంటే మంచిది అన్నారు. రాహుల్ గాంధీ రేవంత్‌ను నమ్ముకున్నారు.. ఆయన బతుకు సికింద్రాబాద్ స్టేషన్ చేస్తారా అని నిలదీశారు. సభలో పురుష ఎమ్మెల్యేలు నిలబడితే అధికార పక్షం తీరు ఇలానే ఉంటుందా అని ప్రశ్నించారు. మహిళలపై అత్యాచారాల గురించి రేపు సభలో లేవనెత్తుతామని, మాకు రేపు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమా గురించి మేము మాట్లాడుకోం.. మహిళలపై జరుగుతున్న ఆఘాయిత్యాలపై ప్రభుత్వం సమాధానం గురించి పట్టుబడుతామన్నారు. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలని, మాకు అండగా నిలిచిన మహిళ లోకానికి బీఆర్ఎస్ శ్రేణులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. తమా ఎమ్మెల్యేలను పోలీస్ వాహనాల్లో తెలంగాణ భవన్‌కు తరలించడాన్ని ఖండించారు. తను రేవంత్‌ను నడిబజార్‌లో నిలబెట్టలేదు, రాజ్ భవన్‌లో కూర్చోబెట్టాను అన్నారు. ఆనవసర విషయాలు మాట్లాడితే రేవంత్ రెడ్డికు మంచిది కాదన్నారు. చేవెళ్ల చెల్లెమ్మా అని నన్ను వైఎస్ పిలిచారని, పీసీసీ అధ్యక్షులు కూడా పార్టీ మారారు.. మమ్మల్నే భట్టి టార్గెట్ చేయడం ఎందుకు అని ప్రశ్నించారు. సీఎం అక్కలు అక్కలు అంటూనే పంగ నామాలు పెడుతున్నారు. మాకు సీఎం క్షమాపణ ముఖ్యం కాదు.. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై ప్రభుత్వ స్పందనే ముఖ్యం అని సబిత ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.
 

newsline-whatsapp-channel
Tags : telangana mla brs congress cm-revanth-reddy sabithaindrareddy

Related Articles