BRS: మున్నేరు ముంపు బాధితులకు ఎంపీ వద్దిరాజు చేయూత

మున్నేరు ముంపు బాధితులకు ఎంపీ వద్దిరాజు చేయూత అందించారు.


Published Sep 03, 2024 02:19:08 PM
postImages/2024-09-03/1725353348_mpvadi.PNG

న్యూస్ లైన్ డెస్క్: మున్నేరు ముంపు బాధితులకు ఎంపీ వద్దిరాజు చేయూత అందించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా మున్నేరు ఉగ్రరూపం దాల్చడంతో ఇండ్లలోకి వరద పోటెత్తి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలుసుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన ఎంపీ వద్దిరాజు వరద ముంపునకు గురైన ప్రాంతాలను సందర్శించి బాధితులను పరామర్శించారు. పుట్టెడు దుఃఖంతో ఉన్న వారిని ఓదార్చి, తానున్నానని భరోసానిచ్చారు. బీఆర్ఎస్ శ్రేణుల ద్వారా సోమవారం బాధితులకు పెద్ద ఎత్తున నిత్యావసరాలను అందించారు. మంగళవారం ఉదయం ఖమ్మం బురహాన్ పురంలోని తన నివాసం వద్ద నిత్యావసరాల సంచులతో నిండిన వాహనాలను ఎమ్మెల్సీ రవీందర్ రావు, మాజీ జేడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజ్, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, బీఆర్ఎస్ నాయకులు శీలంశెట్టి వీరభద్రం, బెల్లం వేణు, తోట వీరభద్రం, గుండ్లపల్లి శేషగిరిరావు తదితర ప్రముఖులు, తన అభిమానగణంతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.

newsline-whatsapp-channel
Tags : telangana hyderabad brs congress cm-revanth-reddy heavy-rains

Related Articles