KTR: కేసీఆర్ పూర్తిచేసిన ప్రాజెక్టు రిబ్బన్ కటింగ్ చేస్తున్నారు

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పూర్తిచేసిన సీతారామ ప్రాజెక్టు రిబ్బన్ కటింగ్ చేసి మేమే చేసినమని రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నాడని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.


Published Aug 15, 2024 03:28:50 PM
postImages/2024-08-15/1723715930_btrs.PNG

న్యూస్ లైన్ డెస్క్: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పూర్తిచేసిన సీతారామ ప్రాజెక్టు రిబ్బన్ కటింగ్ చేసి మేమే చేసినమని రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నాడని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేసీఆర్ పూర్తి చేసిన పనులన్నీ క్రెడిట్ తీసుకోవడం రేవంత్ రెడ్డికి అలవాటయిందని విమర్శించారు. సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవంపైన కేటీఆర్ మాట్లాడారు. మంచి జరిగితే తన ఖాతాలో చెడు జరిగితే మాత్రం కేసీఆర్ ఖాతాలో రేవంత్ వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వాయర్లు కట్టింది పంపులు పెట్టింది మనం.. కానీ మనం కాలువలు తవ్వింది పోయింది. ఓన్లీ రిబ్బన్ కట్ చేస్తే ప్రాజెక్టు కట్టినమని కాంగ్రెస్ చెప్పుకుంటుందన్నారు. 

ప్రజలకు అన్ని విషయాలు తెలుసు.. మీరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసిన అన్ని గమనిస్తారు. భట్టి విక్రమార్క రూ. 75 కోట్లతో సీతారామ ప్రాజెక్ట్ పూర్తి చేశామని చెబుతున్నారు. కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు గురించి క్రెడిట్ తీసుకునేందుకు ముగ్గురు మంత్రులు ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఒకలు పోయి భూమి ముద్దాడి వాళ్లే సీతారామ ప్రాజెక్ట్ కట్టినట్లు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ పీఆర్ స్టంట్లతోని ప్రజలను ఎక్కువ రోజులు కన్‌ఫ్యూజ్ చేయలేరని కేటీఆర్ స్పష్టం చేశారు. 

newsline-whatsapp-channel
Tags : telangana mla brs congress ktr cm-revanth-reddy sitarama-project

Related Articles