BRS: బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకులు

బీఆర్‌ఎస్ యువ నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ నాయకులు చేరారు.


Published Aug 15, 2024 06:54:15 AM
postImages/2024-08-15/1723719244_nsui.PNG

న్యూస్ లైన్ డెస్క్: బీఆర్‌ఎస్ యువ నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ నాయకులు చేరారు. గురువారం రంగారెడ్డి జిల్లా ఎన్‌ఎస్‌యూఐ ఉపాధ్యక్షుడు అభిశేఖ్ ఆద్వర్యంలో రాజేంద్ర నగర్, చేవెళ్ల, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల నుంచి పలువురు ఎన్‌ఎస్‌యూఐ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ మార్పు మొదలైందని, వలసలు పెరుగుతాయని తెలిపారు. ఇచ్చిన హామీలు విస్మరిస్తూ కేవలం రాజకీయాలకు మాత్రమే యువతను వాడుకున్నారని ఆరోపించారు. కొంతమంది ఎమ్మెల్యేలు, నాయకులు స్వార్థంకోసం పార్టీలు మారుతుంటే యువత మాత్రం కేసీఆర్ వెంటే నడవాలని నిర్ణయించుకుంటున్నారు.

కార్యక్రంలో భాగంగా బీఆర్‌ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చటారి దశరథ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే యువత బతుకులు బాగుపడతాయని బోగస్ హామీలిచ్చి యువతను నిండా ముంచిందన్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను రాజకీయాలకు మాత్రమే వాడుకుని మోసం చేసిందని విమర్శించారు. ఎన్‌ఎస్‌యూఐ నుంచి బీఆర్‌ఎస్వీలో చేరుతున్న విద్యార్థి నాయకులందరికీ సముచిత న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను సంపూర్ణంగా అమలు చేస్తారని ఆశించిన యువత అంతా కూడా ఆందోళనలో ఉందన్నారు. యావత్ తెలంగాణ యువత నిరాశలో ఉందని, ఈ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ మాత్రమే శ్రీరామరక్ష అన్నారు. రానున్న రోజుల్లో పెద్దసంఖ్యలో చేరికలు జరుగుతాయని ఎన్‌ఎస్‌యూఐ నాయకులు పేర్కొన్నారు.

newsline-whatsapp-channel
Tags : telangana brs congress rangareddy patollakarthikreddy

Related Articles