BRS నేత గాదరి కిశోర్‌పై కాంగ్రెస్ కార్యకర్తల దాడి

కాంగ్రెస్ కార్యకర్తల దాడిని ఆపడానికి పోలీసులు ప్రయత్నించారు. బారికేడ్లు అడ్డుగా పెట్టి ఆందోళనను ఆపాలని ప్రయత్నించారు. 


Published Aug 22, 2024 02:04:56 PM
postImages/2024-08-22/1724315696_Gadarikishore.jpg

న్యూస్ లైన్ డెస్క్: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి పట్టణంలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగిన మాజీ ఎమ్మెల్యే, BRS నేత గాదరి కిశోర్ పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ధర్నా చేస్తున్న రైతులు, BRS కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తల రాళ్ల దాడి జరిగిందని స్థానికులు చెబుతున్నారు. 

రాళ్లతో దాడి చేయడంతో కారు అద్దాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ కార్యకర్తల దాడిని ఆపడానికి పోలీసులు ప్రయత్నించారు. బారికేడ్లు అడ్డుగా పెట్టి ఆందోళనను ఆపాలని ప్రయత్నించారు. అయినప్పటికీ కాంగ్రెస్ కార్యకర్తలు వెనక్కి తగ్గకుండా దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతో ఆ ప్రాంతమంతా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

newsline-whatsapp-channel
Tags : telangana news-line newslinetelugu brs congress telanganam thungathurthy gadarikishore

Related Articles