Maoist killed: ములుగులో ఎన్కౌంటర్..

మృతుడు భూపాలపల్లి జిల్లా, గొల్ల బుద్ధారం గ్రామానికి చెందిన అశోక్  అయ్యి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 


Published Jul 25, 2024 03:02:32 PM
postImages/2024-07-25/1721899952_modi20240725T145952.854.jpg

న్యూస్ లైన్ డెస్క్: ములుగు జిల్లాలో కాల్పుల కలకలం రేగింది. జిల్లా సరిహద్దుల్లో మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ కాల్పుల్లో  ఒక మావోయిస్టు హతమైనట్లు పోలీసులు వెల్లడించారు. 

నర్సంపేట డివిజన్ కార్యదర్శి బద్రు దళంపై ఎదురు కాల్పులు జరిపామని పోలీసులు తెలిపారు. కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. పలువురు నక్సలైట్లు గాయపడినట్లు తెలుస్తోంది. మృతుడు భూపాలపల్లి జిల్లా, గొల్ల బుద్ధారం గ్రామానికి చెందిన అశోక్  అయ్యి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించామని పోలీసులు వెల్లడించారు. కాల్పులు జరిగిన అడవి స్థలంలో గాయపడిన మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అంతేకాకుండా ఆయుధాల కోసం కూడా వెతుకులాట కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. 

newsline-whatsapp-channel
Tags : telangana ts-news news-line newslinetelugu telanganam police crime encounter

Related Articles