Etala Rajender : ప్రొ.నాగేశ్వర్ కి బీజేపీ ఎంపీ ఈటల చురకలు


Published Aug 29, 2024 06:19:54 PM
postImages/2024-08-29/1724935794_etalacommentsonprof.Nageshwar.jpg

న్యూస్ లైన్ డెస్క్ : రాష్ట్రంలో సీఎం రేవంత్ పరిపాలన, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రశంసలు  కురిపిస్తున్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీద బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గొప్ప ప్రగతి కామికుడు, గొప్ప సంఘ సంస్కర్త, ఆయన మాత్రమే రాష్ట్రాన్ని రక్షించగలడనే రేంజ్ లో నాగేశ్వర్ భుజాల మీదకు ఎత్తుకొని పొగుడుతున్నాడని ఈటల  ఫైర్ అయ్యారు. ఎన్ కన్వెన్షన్ తప్ప హస్మత్ పేట చెరువులో 125 మంది పేదల కన్నీళ్ల బాధ మీకు తెలుసా? అల్వాల్ చెరువులో నెలకు రూ5 వేలు కిస్తీ కట్టే గరీబుల ఆకలి బాధలు తెలుసా? అని నాగేశ్వర్ కు ఈటల చురకలంటించారు.

మేధావులు అనుకునే కొంతమంది యూట్యూబ్ లో ట్రెండింగ్  కోసమో.. ఇంకేదో ఆశపడి పేదల కన్నీళ్లను కప్పిపెట్టే ప్రయత్నం చేస్తూ చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు ఈటల. మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో వందలాది చెరువుల కింద ఉన్న పేదల కన్నీళ్లు తుడిచేందుకు పోరుబాట పడుతామన్నారు. N కన్వెన్షన్ కట్టిన నాడు ముఖ్యమంత్రి రోశయ్య, కలెక్టర్లు, జీహెచ్ఎంసీ ఉన్నప్పుడు కొత్తగా కమిషన్ ఎందుకు అని ఈటల ప్రశ్నించారు.

newsline-whatsapp-channel
Tags : telangana ts-news revanth-reddy cm-revanth-reddy revanth nageswar-rao etela-rajender hydra-commisioner hydra hydra-commissioner-ranganath

Related Articles