FSSAI: టాలివుడ్ హీరో రెస్టారెంట్‌లో ఎక్స్‌పైర్డ్ ఫుడ్..!

ఈ నెల 8న ఫుడ్ సేఫ్టీ& స్టాండర్డ్స్ అథారిటీ అఫ్ ఇండియా (FSSAI) అధికారులు సికింద్రాబాద్‌లోని వివాహభోజనం బు అనే రెస్టారెంట్‌లో తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగానే రెండేళ్ల క్రితం కాలం చెల్లిపోయిన 25 కేజీల చిట్టిముత్యాలు బియ్యాన్ని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా, సైనంతటిక్ ఫుడ్ కలర్స్ కలిపిన కొబ్బరి పొడిని కూడా గుర్తించామని తెలిపారు. 


Published Jul 10, 2024 02:50:58 AM
postImages/2024-07-10//1720597826_modi73.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఓ ప్రముఖ టాలీవుడ్ హీరో రెస్టారెంట్‌లో కాలం చెల్లిన ఆహారం బయటపడింది. ఇటీవల ఆహార భద్రత టాస్క్ ఫోర్స్ అధికారులు.. నగరంలోని రెస్టారెంట్లలో వరుసగా తనిఖీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజగా, సికింద్రాబాద్ లోని ఓ ప్రముఖ రెస్టారెంట్ లో తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగానే కాలం చెల్లిన ఆహారాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అయితే, ఆ రెస్టారెంట్ ఓ ప్రముఖ హీరోకి చెందినది కావడంతో ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 

ఈ నెల 8న ఫుడ్ సేఫ్టీ& స్టాండర్డ్స్ అథారిటీ అఫ్ ఇండియా (FSSAI) అధికారులు సికింద్రాబాద్‌లోని వివాహభోజనం బు అనే రెస్టారెంట్‌లో తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగానే రెండేళ్ల క్రితం కాలం చెల్లిపోయిన 25 కేజీల చిట్టిముత్యాలు బియ్యాన్ని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా, సైనంతటిక్ ఫుడ్ కలర్స్ కలిపిన కొబ్బరి పొడిని కూడా గుర్తించామని తెలిపారు. 

రెస్టారెంట్‌లోని ఫుడ్ హ్యాండ్లర్లకు కూడా మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు లేవని అధికారులు తెలిపారు. కాగా, తనిఖీలు నిర్వహించిన తరువాత ఇటువంటి లోపాలు మళ్లీ కనిపించకుండా చర్యలు తీసుకోవాలని వివాహభోజనంబు రెస్టారెంట్ యాజమాన్యానికి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కాగా, వివాహభోజనంబు రెస్టారెంట్ అధికారిక వెబ్‌సైట్‌లో హీరో సందీప్ కిషన్ పేరు మేనేజింగ్ పార్ట్నర్ అని ఉండడం గమనార్హం. 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu hyderabad telanganam vivahabhojanamburestaurant fssai sandeepkishan

Related Articles