Gadari Kishore: రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి సన్నాసులా..?

మంగళవారం మీడియాతో మాట్లాడిన రేవంత్.. గ్రూప్ పరీక్షలు వాయిదా వెయ్యాలని హరీష్ రావు, కేటీఆర్ దీక్షలకు దిగాలి.. వారి ప్రాణాలు అయిన పోవాలి, పరీక్షలు అయిన వాయిదా పడాలి అని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై స్పందించిన గాదరి కిశోర్ రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మొన్న నీట్ పరీక్ష ఎందుకు రద్దు చేయట్లేదని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా ఆమరణ నిరాహార దీక్ష చెయ్యాలా?  అని ప్రశ్నించారు. 
 


Published Jul 10, 2024 03:23:46 AM
postImages/2024-07-10/1720599642_modi74.jpg

న్యూస్ లైన్ డెస్క్: రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి సన్నాసులా అని BRS నేత, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ ప్రశ్నించారు. బుధవారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులను, నిరుద్యోగులను సన్నాసులని అవమానిస్తున్నారు. గతంలో నిరుద్యోగుల కోసం రాహుల్ గాంధీని తీసుకొని అశోక్ నగర్‌లో తిప్పినప్పుడు.. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి సన్నాసులా..? అని గాదరి కిశోర్ ప్రశ్నించారు. 

రేవంత్ ఓ శాడిస్టులా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. నిరుద్యోగులకు బీఆర్ఎస్వీ మద్దతు ఇచ్చింది. డీఎస్సీని వాయిదా వేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.  సిలబస్ మారడంతో డీఎస్సీని రద్దు చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసులు అడుగు పెట్టలేదు.

 రేవంత్ రెడ్డి పాలనలో ఓయూలో పోలీసులు దమనకాండను సృష్టించారు. కనీసం 20 వేల ఉద్యోగాలతో డీఎస్సీని నిర్వహించాలని తెలిపారు. నిరుద్యోగులను పోలీసులు చిత్రహింసలు పెట్టారు. రేవంత్ రెడ్డి ఇప్పటికే అన్ని ఉద్యోగాలను అమ్ముకున్నారని ఆరోపించారు. 

అంతేకాకుండా, మంగళవారం మీడియాతో మాట్లాడిన రేవంత్.. గ్రూప్ పరీక్షలు వాయిదా వెయ్యాలని హరీష్ రావు, కేటీఆర్ దీక్షలకు దిగాలి.. వారి ప్రాణాలు అయిన పోవాలి, పరీక్షలు అయిన వాయిదా పడాలి అని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై స్పందించిన గాదరి కిశోర్ రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మొన్న నీట్ పరీక్ష ఎందుకు రద్దు చేయట్లేదని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా ఆమరణ నిరాహార దీక్ష చెయ్యాలా?  అని ప్రశ్నించారు. 

రాహుల్ గాంధీని కూడా దీక్ష చేసి చచ్చిపొమ్మంటరా అని గాదరి కిశోర్  అన్నారు. లేకపోతే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి చీడ పురుగు, దరిద్రం అయిన రేవంత్ రెడ్డి దీక్ష చేసి చచ్చిపోవాలని ప్రజలు కోరుకుంటే బాగుంటదా? అని ప్రశ్నించారు. 

newsline-whatsapp-channel
Tags : revanth-reddy newslinetelugu telangana-bhavan telanganam press-meet thungathurthy gadarikishore

Related Articles