Telangana: మరో సినీనటుడికి హైడ్రా దెబ్బ

 సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి కూడా ఇటీవల హైడ్రా నోటీసులు వెళ్లిన విషయం తెలిసిందే. 
 


Published Sep 07, 2024 04:06:37 PM
postImages/2024-09-07//1725705397_newslinetelugu23.jpg

న్యూస్ లైన్ డెస్క్: హైదరాబాద్ నగరంలోని చెరువులు, వాటికి సంబంధించిన స్థలాల్లో ఉన్న కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చేస్తున్నారు. జలాశయాల పరిరక్షణ కోసం సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన హైడ్రా కమిషన్.. చెరువులు, వాటి పరిసరాల్లో ఉన్న కట్టడాలను కూల్చివేస్తోంది. 

ఇందులో భాగంగానే పలువురు వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, సెలెబ్రిటీలు, రాజకీయ నాయకుల సన్నిహితులకు సంబంధించిన కట్టడాలకు కూడా హైడ్రా నోటీసులు పంపించింది. అంతేకాకుండా, సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి కూడా ఇటీవల హైడ్రా నోటీసులు వెళ్లిన విషయం తెలిసిందే. 

ఇప్పటికే హీరో నాగార్జునకు సంబంధించిన N-కన్వెన్షన్‌ను అధికారులు కూల్చేశారు. ఈ నేపథ్యంలోనే మరో సినీ నటుడి మెడకు హైడ్రా ఉచ్చు బిగుసుకుపోతోంది. టాలివుడ్ సీనియర్ నటుడు మురళీమోహన్‌కు హైడ్రా షాక్ తగిలింది. రంగాళ్ కుంట చెరువు వద్ద ఉన్న తన అక్రమ నిర్మాణాలకు తొలగించాలని మురళీమోహన్‌కు హైడ్రా అధికారులు నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది. 

newsline-whatsapp-channel
Tags : telangana ts-news news-line newslinetelugu telanganam hydra-commisioner hydra hydra-commissioner-ranganath

Related Articles