KTR: ఆయనే మాకు స్ఫూర్తి

జయశంకర్ స్ఫూర్తితోనే తెలంగాణలో కేసీఆర్ పాలన నడిచిందన్నారు. ఆయనకు గుర్తుగానే జయశంకర్ పేరుతో జిల్లాను ఏర్పాటు చేసుకున్నామని, వ్యవసాయ యూనివర్సిటీకి జయశంకర్ పేరు పెట్టుకున్నామన్నారు. 


Published Aug 06, 2024 03:22:24 AM
postImages/2024-08-06/1722932408_brsindelhi.jpg

న్యూస్ లైన్, ఢిల్లీ: తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ తమకు స్ఫూర్తిప్రధాత అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఢిల్లీలో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమానికి మొదటి నుండి జయశంకర్ అండగా ఉన్నారని గుర్తు చేశారు.  

ఆనాడు తెలంగాణ ఉద్యమ సమయంలో ఢిల్లీలో కేసీఆర్‌తో కలిసి జయశంకర్ 36 పార్టీలను ఒప్పించి తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇప్పించారన్నారు. జయశంకర్ స్ఫూర్తితోనే తెలంగాణలో కేసీఆర్ పాలన నడిచిందన్నారు. ఆయనకు గుర్తుగానే జయశంకర్ పేరుతో జిల్లాను ఏర్పాటు చేసుకున్నామని, వ్యవసాయ యూనివర్సిటీకి జయశంకర్ పేరు పెట్టుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో హరీష్ రావు, కేపీ వివేకానంద, గంగుల కమలాకర్, జగదీశ్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ ఎంపీలు దామోదర్ రావు, వద్దిరాజు రవిచంద్ర, ఎర్రబెల్లి దయాకరరావు, పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.

newsline-whatsapp-channel
Tags : news-line newslinetelugu telanganam delhi pro.jayashankarsir jayashankarsir ktrbrs

Related Articles