Erravelli: కేసీఆర్‌ను కలిసిన కవిత

కన్న బిడ్డను చూడగానే కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. అక్రమ నిర్బంధం నుంచి బయటకొచ్చిన బిడ్డను చూడగానే కేసీఆర్ కండ్లల్లో ఆత్మీయ ఆనందం కనిపించింది. 


Published Aug 29, 2024 02:00:17 PM
postImages/2024-08-29/1724920217_kavithakcr.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఎమ్మెల్సీ కవిత ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్నారు. ఇటీవల జైలు నుంచి విడుదలైన ఆమె గురువారం ఆమె తండ్రి, మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు వెళ్లారు. భర్త, కుమారుడితో కలిసి ఆమె ఎర్రవెల్లిలోని నివాసానికి వెళ్లారు. పుట్టింటికి వెళ్లిన ఆడబిడ్డను ఆత్మీయంగా ఆహ్వానించారు. సిబ్బంది ఆమెకు దిష్టి తీసి స్వాగతం పలికారు. 

కన్న బిడ్డను చూడగానే కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. అక్రమ నిర్బంధం నుంచి బయటకొచ్చిన బిడ్డను చూడగానే కేసీఆర్ కండ్లల్లో ఆత్మీయ ఆనందం కనిపించింది. కేసీఆర్ వద్దకు వెళ్లిన కవిత ఆయన పాదాలకు నమస్కరించారు. దాదాపు ఐదున్నర నెలలు జైల్లో ఉంది బయటకు వచ్చిన కవితను చూడగానే కేసీఆర్ ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నారు.

newsline-whatsapp-channel
Tags : kcr telangana ts-news news-line newslinetelugu tspolitics telanganam mlc-kavitha kavitha

Related Articles