KTR: వలస ఎంత వాస్తవమో.. దోపిడీ కూడా అంతే వాస్తవం

గతంలో సుష్మా స్వరాజ్ విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తెలుగు రాష్ట్రాల నుంచి గల్ఫ్‌కి జరుగుతున్న ఆడవాళ్ల ఆక్రమ రవాణాపై కూడా చర్చించారని కేటీఆర్ తెలిపారు. ఆ దిశగా దాని అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్ దాకా ఎన్నో రంగాల్లో రాష్ట్రాల నుంచి తెలంగాణకు వలస వస్తున్నారని తెలిపారు.   
 


Published Jul 14, 2024 06:08:03 AM
postImages/2024-07-14//1720955236_modi20240714T163629.036.jpg

న్యూస్ లైన్ డెస్క్: దుబాయ్ అయినా హైదరాబాద్ అయినా ఇంకెక్కడైనా, వలస ఎంత వాస్తవమో.. వలసలోన దోపిడీ కూడా అంతే వాస్తవమని మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదివారం 'మేక బతుకు' అనే పుస్తక బతుకు పుస్తకావిష్కరణలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. తాను స్వయంగా దుబాయ్ వెళ్లాలని, అక్కడ ఉన్న లేబర్ క్యాంపులో కార్మికుల కష్టాలను చూశానని గుర్తుచేసుకున్నారు.

గల్ఫ్ కార్మికుల కష్టాలు విన్నా.. చూసినా గుండె తరుక్కుపోతుందని అన్నారు. అక్కడ వారు నివసిస్తున్న పరిస్థితులను చూస్తే బాధ కలుగుతుందని తెలిపారు. గతంలో గల్ఫ్ కార్మికుల కోసం పాలసీ  తెచ్చేందుకు ప్రయత్నించామని, టామ్‌కామ్ సంస్థ ద్వారా కూడా ప్రయత్నాలు జరిపామని తెలిపారు. పెద్దూరు వలస కార్మికుల కోసం దుబాయ్‌లోని జైలుకు వెళ్లి కలిసి వచ్చానని తెలిపారు. వారిని విడిపించేందుకు అనేక ప్రయత్నాలు చేసి.. సంవత్సరాల తర్వాత చివరికి ఇండియాకి తీసుకు రాగలిగామని కేటీఆర్ గుర్తుచేశారు.

గతంలో సుష్మా స్వరాజ్ విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తెలుగు రాష్ట్రాల నుంచి గల్ఫ్‌కి జరుగుతున్న ఆడవాళ్ల ఆక్రమ రవాణాపై కూడా చర్చించారని కేటీఆర్ తెలిపారు. ఆ దిశగా దాని అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్ దాకా ఎన్నో రంగాల్లో రాష్ట్రాల నుంచి తెలంగాణకు వలస వస్తున్నారని తెలిపారు.   

ప్రస్తుతం సమాజంలో చదివే అలవాటు బాగా తగ్గుతూ వస్తుందని, ఇలాంటి సమయంలో కూడా అన్విక్షకి సంస్థ ఈ పుస్తకాన్ని తీసుకురావడం హర్షనీయమని అన్నారు. సమాజంలో మార్పు తీసుకొని రాగలిగే పుస్తకాలకు, సాహిత్యానికి మద్దతు ఇవ్వాలని కేటీఆర్ సూచించారు.   

newsline-whatsapp-channel
Tags : telangana newslinetelugu ktr telanganam mekabatuku

Related Articles