KTR: 8 ఎంపీ సీట్లు ఇచ్చినా అదే వివ‌క్షా..?

మొన్నటి కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు చేసిన అన్యాయం అంత ఇంతా కాదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.


Published Jul 27, 2024 05:05:37 AM
postImages/2024-07-27/1722074720_modi20240718T103246.437.jpg

న్యూస్ లైన్ డెస్క్: 8 ఎంపీ సీట్లు ఇచ్చినా తెలంగాణ‌పై కేంద్రం అదే వివ‌క్ష చూపిస్తోంద‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మొద‌టి నుండే ప్ర‌ధాని మోడీ తెలంగాణ‌పై ద్వేషం నింపుకున్నార‌ని మండిప‌డ్డారు. మెట్రోకు నిధులు కేటాయించ‌క‌పోవ‌డంపై కేటీఆర్ శ‌నివారం ట్విట్ట‌ర్‌లో స్పందించారు. త‌న పోస్టులో.. ఎన్నిసార్లు నిధులు మంజూరు చేయాలని అడిగినప్పటికీ మోడీ పట్టించుకోలేదని చెప్పారు. ఇతర రాష్ట్రాలపై మాత్రం ఎనలేని ప్రేమ చూపుతున్నారని దుయ్యబట్టారు. మొన్నటి కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు చేసిన అన్యాయం అంత ఇంతా కాదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

హైదరాబాద్ మెట్రో రైలు కోసం నిధులు మంజూరు చేయాలని ఎన్నిసార్లు కోరినప్పటికీ పెడచెవిన పెట్టారన్నారు. తాజాగా ప్రకటించిన బడ్జెట్‌లోనూ మళ్లీ హైదరాబాద్ మెట్రోకు మొండి చెయ్యి చూపించారని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచే తల్లిని చంపి బిడ్డను బతికించారంటూ మోడీ తన తెలంగాణ వ్యతిరేకతను ఎన్నోసార్లు బయటపెట్టుకున్నారని గుర్తు చేశారు. అదే ద్వేషాన్ని రాష్ట్ర‌ అభివృద్ధికి నిధులు ఇచ్చే విషయంలోనూ చూపిస్తున్నార‌ని ఆరోపించారు. కేంద్రంలో ఎన్డీఏ వ‌స్తే రాష్ట్రంలో బీజేపీకి సీట్లు ఇస్తే అభివృద్ధి జ‌రుగుతుంద‌ని ప్ర‌జ‌లు భావించార‌ని కానీ లాభం లేద‌న‌న్నారు. రాష్ట్రంలోని 8మంది బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు.

గత పదేళ్లలో దేశంలోని 20 మెట్రో ప్రాజెక్ట్‌ల కోసం మోడీ ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు భారీగానే నిధులు కేటాయించింది. కానీ తెలంగాణకు మాత్రం చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదన్నారు. హైదరాబాద్ మెట్రో విషయంలో జరిగిన అన్యాయాన్ని మోడీకి వివరించి రాష్ట్ర బీజేపీ ఎంపీలు నిధులు తేవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ మెట్రోకు ఎన్నోసార్లు నిధులు కావాలని కోరినా పట్టించుకోలేదని గుర్తు చేశారు. ఈ సంద‌ర్భంగా కేంద్రం హైద‌రాబాద్ మెట్రోను విస్మ‌రిస్తూ ఇత‌ర రాష్ట్రాల మెట్రోల‌కు భారీగా నిధులు కేటాయించిన వివ‌రాల‌ను లెక్క‌ల‌తో వివ‌రించారు. 

ఉత్తర ప్రదేశ్ (4 ప్రాజెక్టులు) – రూ. 5,134.99 కోట్లు
మహారాష్ట్ర (3 ప్రాజెక్టులు) – రూ. 4,109 కోట్లు
గుజరాత్ (3 ప్రాజెక్టులు) – రూ. 3,777.85 కోట్లు
ఢిల్లీ (2 ప్రాజెక్టులు) – రూ. 3,520.52 కోట్లు
కర్ణాటక- రూ. 1880.14 కోట్లు
మధ్యప్రదేశ్ (2 ప్రాజెక్టులు) – రూ. 1,638.02 కోట్లు
బీహార్ – రూ. 1,400.75 కోట్లు
తమిళనాడు – రూ. 713 కోట్లు
కేరళ (2 ప్రాజెక్టులు) – రూ. 146.74 కోట్లు
రాపిడ్ రైల్ ప్రాజెక్ట్ (ఢిల్లీ-ఘజియాబాద్) – రూ. 1,106.65 కోట్లు

newsline-whatsapp-channel
Tags : telangana ts-news newslinetelugu budjet

Related Articles