Hyderabad: బల్కంపేట ఎల్లమ్మపై అలిగిన మంత్రి, మేయర్.. ఎందుకంటే..?

మంత్రి పొన్నంకు స్వాగతం పలికే సమయంలో స్వల్ప తోపులాట జరిగిందట. ఓవైపు భక్తుల తాకిడి, మరోవైపు ఎల్లమ్మ కళ్యాణం జరుగుతుండడంతో జనాల రద్దీ ఎక్కువగా ఉందని, ఆలయ అర్చకులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వినిపించుకొని మంత్రి, మేయర్ ఆలయం బయటనే కూర్చున్నారని టెంపుల్ సిబ్బంది తెలిపారు. బతిమాలినా ఆలయంలోనికి వెళ్లలేదని తెలిపారు. 


Published Jul 09, 2024 01:11:52 AM
postImages/2024-07-09/1720505462_Screenshot20240709113352.jpg

న్యూస్ లైన్ డెస్క్: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణంలో మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ మేయర్‌ గద్వాల్ విజయలక్ష్మి అలిగారు. ఆలయం బయట కూర్చొని ఆగ్రహం వ్యక్తం చేశారు. బల్కంపేట ఎల్లమ్మ కల్యాణంలో కనీస ప్రోటోకాల్ పాటించడం లేదంటూ మండిపడ్డారు. ప్రోటోకాల్ పాటించనివారిపై చర్యలు తీసుకోవడం లేదని కలెక్టర్ అనుదీప్‌పై పొన్నం ప్రభాకర్, విజయలక్ష్మి అసహనం వ్యక్తం చేశారు. 

కాగా, మంత్రి పొన్నంకు స్వాగతం పలికే సమయంలో స్వల్ప తోపులాట జరిగిందట. ఓవైపు భక్తుల తాకిడి, మరోవైపు ఎల్లమ్మ కళ్యాణం జరుగుతుండడంతో జనాల రద్దీ ఎక్కువగా ఉందని, ఆలయ అర్చకులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వినిపించుకొని మంత్రి, మేయర్ ఆలయం బయటనే కూర్చున్నారని టెంపుల్ సిబ్బంది తెలిపారు. బతిమాలినా ఆలయంలోనికి వెళ్లలేదని తెలిపారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu telanganam balkampet ponnamprabhakar gadwalvijayalakshmi balkampet-ellamma balkampettemple protocol

Related Articles