Kavitha: ఎమ్మెల్సీ కవితకు మరోసారి అస్వస్థత

 ఇప్పటికే గతంలో ఒక సారి ఆమె అస్వస్థతకు గురయ్యారు. దీంతో అధికారులు ఆమెను ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కాస్త కోలుకున్న తర్వాత తిరిగి జైలుకు పంపించారు.


Published Aug 22, 2024 12:58:32 PM
postImages/2024-08-22/1724311712_kavithainaims.jpg

న్యూస్ లైన్ డెస్క్: BRS ఎమ్మెల్సీ కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీ లిక్కర్ పాలిసీ కేసులో అరెస్ట్ అయిన ఆమె గత ఆరుబ నెలలుగా ఢిల్లీలోని తీహార్ జైల్లోనే ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే గతంలో ఒక సారి ఆమె అస్వస్థతకు గురయ్యారు. దీంతో అధికారులు ఆమెను ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కాస్త కోలుకున్న తర్వాత తిరిగి జైలుకు పంపించారు.

అయితే, తాజాగా మరోసారి కవిత అనారోగ్యం బారిన పడినట్లు తెలుస్తోంది. గైనిక్ సమస్య, వైరల్ ఫీవర్తో కవిత బాధపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. గురువారం ఉదయం ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

newsline-whatsapp-channel
Tags : ts-news news-line newslinetelugu brs telanganam delhi liquor-policy-case mlc-kavitha delhi-liquor-policy-case

Related Articles