Plane crash: కుప్పకూలిన విమానం.. 19 మంది మృతి

 ఈరోజు ఉదయం 19 మంది ప్రయాణికులతో పొఖారాకు బయలుదేరింది. విమానంలో ఇద్దరు సిబ్బంది, 17 మంది సాంకేతిక నిపుణులు ఉన్నట్లు తెలుస్తోంది.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-24/1721820229_modi20240724T164549.601.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఓ ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ విమానం టేకాఫ్ సమయంలో రన్‌వేపైనే కుప్పకూలిపోయింది. నేపాల్ లోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. 

శౌర్య ఎయిర్‌లైన్స్ అనే విమానం ఈరోజు ఉదయం 19 మంది ప్రయాణికులతో పొఖారాకు బయలుదేరింది. విమానంలో ఇద్దరు సిబ్బంది, 17 మంది సాంకేతిక నిపుణులు ఉన్నట్లు తెలుస్తోంది. నేపాల్ వద్ద రన్‌వే-02 నుండి విమానం టేకాఫ్ అయిన వెంటనే అదుపు తప్పి కుప్పకూలింది. 

అయితే, టేకాఫ్ చేస్తుండగానే ప్రమాదం జరగడంతో విమానంలో ప్రయాణిస్తున్న వారంతా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. విమానం పోఖారాకు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలానికి చేరుకున్న సహాయక బృందాలు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. 
 

newsline-whatsapp-channel
Tags : news-line newslinetelugu telanganam planecrash tribhuvaninternationalairport kathmandu nepalplanecrash

Related Articles