Hyderabad: మేయర్ విజయలక్ష్మికి నిరసన సెగ

గత కొంత కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయాలని ఇప్పటికే విజయలక్ష్మిని కోరినట్లు కార్పొరేట్లర్లు తెలిపారు. అయినప్పటికీ తమను పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. 


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-06/1720246781_modi34.jpg

న్యూస్ లైన్ డెస్క్: హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి నిరసన సెగ తగిలింది. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి వెళ్లిన ఆమెపై బీఆర్ఎస్ కార్పొరేటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొంత కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయాలని ఇప్పటికే విజయలక్ష్మిని కోరినట్లు కార్పొరేట్లర్లు తెలిపారు. అయినప్పటికీ తమను పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. 

పెండింగ్‌లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. పోడియం చుట్టూ చేరి మేయర్ విజయలక్ష్మీ రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. దీంతో ఆమె బీఆర్ఎస్ కార్పొరేటర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తన సీట్లో నుండి లేచి వెళ్లిపోయారు. అనంతరం కార్యాలయం బయటకు వచ్చిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. 

newsline-whatsapp-channel
Tags : news-line newslinetelugu hyderabad tspolitics telanganam mayor vijayalakshmi ghmc-council

Related Articles