Rakesh reddy: రేవంత్ రెడ్డికి పని తక్కువ.. పబ్లిసిటీ ఎక్కువ..!

హైడ్రాతో హై లెవల్ కమిషన్లు తప్ప ఇంకోటి లేదని ఆయన అన్నారు. నెల రోజుల పరిధిలోనే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని చెరువులను, కుంటలను హైడ్రా సర్వే చేసిందా అని రాకేష్ రెడ్డి ప్రశ్నించారు. 


Published Aug 31, 2024 04:36:54 PM
postImages/2024-08-31/1725102414_rakeshreddy.jpg

న్యూస్ లైన్ డెస్క్: `సీఎం రేవంత్ రెడ్డి చేసే పని తక్కువ.. పబ్లిసిటీ ఎక్కువ అని BRS నేత ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా కమిషన్ కూల్చివేతలపై ఆయన స్పందించారు. 

హైడ్రాతో హై లెవల్ కమిషన్లు తప్ప ఇంకోటి లేదని ఆయన అన్నారు. నెల రోజుల పరిధిలోనే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని చెరువులను, కుంటలను హైడ్రా సర్వే చేసిందా అని రాకేష్ రెడ్డి ప్రశ్నించారు. సర్వే చేసి ఎవరు ఎక్కడా కబ్జాలు చేశారో తేల్చిందా ఈ హైడ్రా అని ఆయన ప్రశ్నించారు. దీనిపై కనీసం ఒక అధ్యయనం కూడా చేయలేదని ఆయన అన్నారు. దీనిపై కేబినెట్ సమావేశంలో కూడా చర్చించలేదని తెలిపారు. 

అంధులు, దివ్యాంగులు, వికలాంగుల పొట్ట కొట్టడానికి రేవంత్ రెడ్డికి మనసు ఎలా వచ్చింది? అని అయన ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిని మా పాలమూరు బిడ్డే అని రాజును చేస్తే, అదే పాలమూరు బిడ్డ ఈరోజు రాక్షసుడై పేద ప్రజల రక్తం తాగుతున్నారని ఆయన విమర్శించారు. నాడు కాంగ్రెస్‌లో ఉన్న ఏ నాయకుడు కూడా పేద ప్రజల పొట్ట కొట్టలేదు, నువ్వు మాత్రం పేదల రక్తం తాగుతున్నావు రేవంత్ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

newsline-whatsapp-channel
Tags : telangana ts-news news-line newslinetelugu tspolitics rakesh-reddy telangana-bhavan telanganam press-meet rakesh-reddy-enugula

Related Articles