AP: వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించిన రోజా

వైఎస్ఆర్ ఒక యుగపురుషుడు అని ఆమె అన్నారు. అయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ప్రజలు ప్రతి ఇంటిలోను ఆరాధ్య దైవంగా భావిస్తున్నారని తెలిపారు.
 


Published Sep 02, 2024 05:19:44 PM
postImages/2024-09-02/1725277784_ROJA.jpg

న్యూస్ లైన్ డెస్క్: దివంగత సీఎం డా.వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు రోజా నివాళులర్పించారు. ఆయన వర్ధంతి సందర్బంగా పూలమాల వేసి నివాళులర్పించిన ఆమె.. మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ ఒక యుగపురుషుడు అని ఆమె అన్నారు. అయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ప్రజలు ప్రతి ఇంటిలోను ఆరాధ్య దైవంగా భావిస్తున్నారని తెలిపారు.

ఆయన ప్రవేశపెట్టిన రైతులకు ఉచిత కరెంటు, ఆరోగ్యశ్రీ, 108 సేవలను ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని రోజా అన్నారు. వైఎస్ఆర్ ఇప్పుడు మన మధ్యన లేకపోయినా ఆయన కుమారుడు వైయస్ జగన్ ప్రజలకు నేనున్నానంటూ ఎన్నో కష్టాలను, నష్టాలను, ప్రజల కోసం ఓర్చుకొని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని ఆమె గుర్తుచేశారు. వైఎస్ఆర్ లేకపోయినా, ఆయన ఆశయాలను నెరవేర్చడానికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు నిరంతరం కృషి చేస్తారని రోజా తెలిపారు. 

newsline-whatsapp-channel
Tags : ap-news andhrapradesh news-line newslinetelugu ycp telanganam roja rajashekar

Related Articles