Assembly: మీడియా పాయింట్ వద్ద కన్నీళ్లు పెట్టుకున్న సబితా

వెనకాల ఉండే అక్కలు.. ఇక్కడ ఉండి చెప్పి చెప్పి ఇక్కడ ముంచి అక్కడ తేలరంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఆ అక్కల మాటలు వింటే జూబ్లీ బస్టాండ్ లో కూర్చోవాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు. దీనిపై స్పందించిన సబితా.. తనను ఎద్దేశించే రేవంత్ ఆ మాటలు అన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


Published Jul 31, 2024 05:58:22 AM
postImages/2024-07-31/1722423494_newslinetelugu1.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద BRS ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో సబితను ఉద్దేశించి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. ఈ సందర్బంగా మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. ఆమె భావోద్వేగానికి గురయ్యారు. 

వెనకాల ఉండే అక్కలు.. ఇక్కడ ఉండి చెప్పి చెప్పి ఇక్కడ ముంచి అక్కడ తేలరంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఆ అక్కల మాటలు వింటే జూబ్లీ బస్టాండ్ లో కూర్చోవాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు. దీనిపై స్పందించిన సబితా.. తనను ఎద్దేశించే రేవంత్ ఆ మాటలు అన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం తనను టార్గెట్ చేసారని ఆమె మండిపడ్డారు.  రేవంత్ రెడ్డికి తనపై కక్ష ఎందుకని ఆమె ప్రశ్నించారు. సీఎం ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి వచ్చారని ప్రశ్నించారు. కేసీఆర్ ఇంటి మీద వాలిన కాకి, నా ఇంటి మీద వాలితే కాల్చి చంపేస్తామని రేవంత్ అన్నారని ఆమె వెల్లడించారు. 

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఆలోచన రహితంగా మాట్లాడారని ఆమె అన్నారు. ఏ మొహం పెట్టుకొని అసెంబ్లీకి వచ్చారని భట్టి వ్యాఖ్యానించారని వాపోయారు. దీనిపై స్పందించిన సబితా ఇంద్రారెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. మహిళలకు అసెంబ్లీలో ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆమె ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిని తన సొంత తమ్ముడిగా భావించానని అన్నారు. ఈ రోజు అసెంబ్లీలో జరిగిన విషయం మహిళా ఎమ్మెల్యేలకే అవమానకరం కాదు. రాష్ట్రంలోని మహిళలు అందరికీ అవమానకరమని ఆమె అన్నారు.

newsline-whatsapp-channel
Tags : telangana ts-news news-line newslinetelugu brs cm-revanth-reddy assembly sabithaindrareddy telanganaassembly mlasabithaindrareddy malasabitha

Related Articles