Siddhu Jonnalagadda: వరద బాధితులకు డీజే టీల్లు భారీ విరాళం

తెలుగు రాష్ట్రాలకు సిద్దు జొన్నలగడ్డ రూ.30 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.


Published Sep 03, 2024 02:36:42 PM
postImages/2024-09-03/1725354402_siddhu.PNG

న్యూస్ లైన్ సినిమా: టాలీవుడ్ యువ హీరో డీజే టీల్లు ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలకు అతలాకుతలం అయిన కుటుంబాలకు భారీ విరాళం ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సిద్దు జొన్నలగడ్డ రూ.30 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఏపీకి రూ.15 లక్షలు, తెలంగాణకు రూ.15 లక్షలు ఇచ్చాడు. ఈ విషయాన్ని సిద్దు సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

తెలుగు రాష్ట్రాలను ఇలా వరదలు ముంచెత్తడం చాలా బాధాకరమైన విషయం. ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే ఇంకెవ్వరికీ ఇలాంటి పరిస్థితి రాకూడదు అనిపిస్తోంది. వరదలు కుటుంబాలను కష్టాల్లోకి వెట్టేసాయి. ఇలాంటి సమయాల్లో మనం ఒకరికొకరు తోడుగా ఉండటం అత్యవసరం. బాధితులకు నా వంతు సహకారంగా 30 లక్షల ఆర్థిక సహాయాన్ని (ఆంధ్ర ప్రదేశ్ 15 లక్షలు, తెలంగాణం 15 లక్షలు) వరద సహాయ నిధికి ప్రకటిస్తున్నాయి. ఇవి కొంతమందికైనా ఏదో ఒకవిధంగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను అని సిద్దు తన పోస్టులో రాసుకోచచ్చారు. ఇప్పటీకే జూనియర్ ఎన్టీఆర్ వరద బాధితులకు రూ. కోటి రూపాయల విరాళం అందించారు. ఆంధ్రప్రదేశ్‌కు రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ.50 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు.

newsline-whatsapp-channel
Tags : telangana tollywood hero- siddu-jonnalagadda floods-in-telangana

Related Articles