Final Match: ఆసియా కప్ శ్రీంలక దే

మహిళ ఆసియా కప్ పోరులో శ్రీలంక ఘన విజయం సాధించింది. రంగి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియం టీమిండియా వర్సెస్ శ్రీలంక ఫైనల్ మ్యాచ్‌లో చమరి ఆటపట్టు సేన స్తతా చాటింది.


Published Jul 28, 2024 08:08:15 AM
postImages/2024-07-28/1722171544_srilanka.jpeg

ఆసియా కప్ శ్రీంలక దే
భారత్ పై లంక ఘన విజయం


న్యూస్ లైన్ స్పోర్ట్స్: మహిళ ఆసియా కప్ పోరులో శ్రీలంక ఘన విజయం సాధించింది. రంగి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియం టీమిండియా వర్సెస్ శ్రీలంక ఫైనల్ మ్యాచ్‌లో చమరి ఆటపట్టు సేన స్తతా చాటింది. లంక బ్యాటర్లు చమరి ఆటపట్టు, హర్షిత సమరవిక్రమ అర్థ సెంచరీతో రఫాడించగా.. కవిషా దిల్హరి విధ్వంసకర ఇన్నింగ్స్‌తో అదరగొట్టింది. దాంతో శ్రీలంక, భారత జట్టుపై 8 వికెట్ల తేడాతో ఆసియా కప్ ఫైనల్‌లో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ విజయంతో శ్రీలంక మహిళ జట్టు తమ రెండోవ ఆసియా కప్ ట్రోఫీని ముద్దాడారు. 


ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా జట్టుకు సాలిడ్ స్టార్ట్ లభించింది. భారత్ ఓపెనర్లు స్మృతి మంధన, షఫాలీ వర్మ ధనాధన బ్యాటింగ్ చేస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈ జోడి కలిసి స్కోర్ బోర్డుకు 40 పరుగులు జతచేశారు. అయితే షఫాలీ(16), కవిషా దిల్హరి బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగింది. ఆ తర్వాత క్రీజులో ఉమా చెత్రీ(9) కూడా పెవిలియన్ బట పట్టింది. దాంతో భారత్ రెండు వికెట్లు కోల్పోయి 60 రన్స్ కొట్టింది. ఓవైపు వికెట్లు పడుతున్న స్మ‌‌‌ృతి మంధన లంక బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ బౌండరీలు, సిక్సర్లు బాదింది. దాంతో మంధన ( 36 బంతుల్లో 53 పరుగులు 9 ఫోర్లు, 1 సిక్సర్) సహయంతో అర్ధ శతకం పూర్తి చేసింది. అయితే ఈ సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అంత రాణించలేకపోయింది. కౌర్(11)ను సచికా ప్రబోధని వెనక్కి పంపింది. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన జెమీమా రోడ్రిగ్స్ మంధనతో కలిసి మంచి ఇన్నింగ్స్ ఆడింది.  వీళ్లిందరూ కలిసి 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకోల్పారు. అయితే జెమీమా(29) రనౌట్‌గా పెవిలియన్‌కు చేరింది. ఆ కాసేపటీకే మంధన(60), కవిషా దిల్హరి ఓవర్‌లో భారీ ష్టార్ట్ ఆడే క్రమంలో బౌండరీ వద్ద క్యాచ్ ఇచ్చి ఔటయ్యింది. ఇక ఆఖరిలో రిచా ఘోష్(30) తుఫాన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టింది. దాంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. లంక బౌలర్లు కవిషా దిల్హరి రెండు వికెట్లు పడగొట్టాగా.. చమరి అతపత్తు, సచికా ప్రబోధని, సచిని నిసంసల తలా వికెట్ తీశారు.

 
భారీ టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలో దిగిన శ్రీలంక జట్టు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ విష్మి గుణరత్నే రీచా ఘోష్ బౌలింగ్‌లో రనౌట్ అయ్యింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన హర్షిత సమరవిక్రమ మంచి ఇన్నింగ్స్ ఆడింది. మరో ఎండ్‌లో చమరి ఆటపట్టు దూకుడు బ్యాటింగ్ చేసింది. బౌండరీలు, సిక్సర్లు కొడుతూ ధనాధన ఇన్నింగ్స్ ఆడింది. దాంతో చమరి( 36 బంతుల్లో 52 రన్స్ 9 ఫోర్లు, 2 సిక్సర్ల)తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. ఈ ఇద్దరూ కలిసి లంక స్కోర్ బోర్డుకు 90 పరుగులు జోడించారు. అయితే ఈ జోడిని స్టార్ స్పిన్నర్ దీప్తీ శర్మ బ్రేక్ చేసింది. ఓ చక్కని బంతితో కెప్టెన్ చమరి(61)ను పెవిలియన్‌కు చేర్చింది. అయితే హర్షిత మాత్రం టీమిండియా బౌలర్లపై విరుచుకుపడ్డింది. బౌండరీలు, సిక్సర్లు బాదుతూ విధ్వంసకర బ్యాటింగ్ చేసింది. దీంతో 35 బంతుల్లో 55 రన్స్ 6 ఫోర్లు, 2 సిక్సర్ల) సహయంతో ఫిఫ్టి పూర్తి చేసింది. మరో బ్యాటర్ కవిషా దిల్హరి కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. ఈ జోడి 70 పరుగు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. హర్షిత(69 నటౌట్), కవిషా(30 నటౌట్) ఇద్దరూ క్రీజులో నిలబడి లంక జట్టుకు భారీ విజయాన్ని అందించారు. దాంతో శ్రీలంక, టీమిండియా జట్టుపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దాంతో ఆసియా కప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. భారత బౌలర్ల దీప్తి శర్మ ఒక వికెట్ తీసింది.
 

newsline-whatsapp-channel
Tags : india-women asia-cup cricket-news srilanka

Related Articles